News November 19, 2024
విజయనగరం: రఘురాజుపై అనర్హత వేటు రద్దు

శృంగవరపుకోట నియోజకవర్గ నేత ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటును రద్దు చేస్తూ మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయన పై అనర్హత వేటును రద్దు చేస్తూ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బుధవారం నుంచి ఆయన మండలి సమావేశాలకు హాజరుకానున్నారు.
Similar News
News November 15, 2025
VZM: కుష్టు వ్యాధిపై అవగాహన రథాన్ని ప్రారంభించిన DMHO

జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల 17 నుంచి 30 వరకు ఇంటింటి సర్వే ద్వారా కుష్టు కేసులను గుర్తించే “లెప్రసీ కేస్ డిటెక్షన్ కాంపెయిన్” జరగనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. జీవనరాణి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే ఆటో ప్రచార రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో ప్రజలు ఆరోగ్య కార్యకర్తలకు సహకరించాలన్నారు.
News November 15, 2025
ఉపాధి హామీలో లక్ష్యాలు పూర్తి చేయాలి: VZM కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద రోజువారీ లక్ష్యాలను పూర్తి చేసి, ప్రతి కుటుంబానికి 100 రోజుల పనులు శాత శాతంగా అందించాల్సిన అవసరాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉపాధి పనులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, డ్వామా పథక సంచాలకులు, ఏపీడీలు, ఏపీవోలు, ఎంపీడీవోలతో మండల వారీ పురోగతిని సమీక్షించారు. పనిదినాలు, కనీస వేతనాలు, హాజరు శాతం వంటి అంశాలపై విశ్లేశించారు.
News November 15, 2025
ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి: ఎస్.కోట సీఐ

ఎస్.కోట అగ్నిమాపక కేంద్రంలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ (39) వెన్ను, కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు CI నారాయణ మూర్తి తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. సెలవుపై ఇంటిలోనే ఉంటున్నాడు. ఈనెల 13న పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అతని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


