News January 3, 2025

విజయనగరం: లవ్ మ్యారేజ్.. దంపతుల సూసైడ్

image

విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు పెందుర్తి మండలం పురుషోత్త పురంలో ఉరివేసుకుని చనిపోయారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. చీపురుపల్లికి చెందిన సంతోష్ (35) విశాఖకు చెందిన సంతోష్ శ్రీ (25) లవ్ చేసుకున్నారు. ఆరేళ్ల క్రితం పెళ్లి కాగా పిల్లలు లేరు. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని మృతిచెందారు. పెందుర్తి పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 24, 2025

విశాఖలో విజయనగరం విద్యార్థి మృతి

image

విజయనగరం జిల్లా యువకుడు గంభీరం డ్యామ్‌లో మృతి చెందాడు. గరివిడి మండలం కందిపేటకు చెందిన మీసాల నాని విశాఖలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఆనందపురం మండలం గంభీరం డ్యామ్‌‌లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News January 24, 2025

VZM: ‘పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు’

image

జిల్లా పోలీసు కార్యాలయంలో “పోలీసు వెల్ఫేర్ డే” ను శుక్రవారం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఐదుగురు సిబ్బంది నుంచి వినతులు విజ్ఞాపనలు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఎస్పీ స్వయంగా పుస్తకంలో నోట్ చేసుకొని, వాటి పూర్వాపరాలు పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానని జిల్లా పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తానన్నారు.

News January 24, 2025

VZM: జిల్లాలో 431 గోకులాల నిర్మాణం పూర్తి: కలెక్టర్

image

జిల్లాలో మొదటి విడతలో భాగంగా 996 గోకులాలు మంజూరు చేయగా, వీటిలో 431 నిర్మాణాలు పూర్తయ్యాయని కలెక్టర్ అంబేడక్కర్ తెలిపారు. సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత డ్వామా APOలపై ఉందని స్పష్టం చేశారు. రెండో విడత కింద ఫిబ్రవరి మొదటి వారంలో మరో 1000 గోకులాల నిర్మాణాలు ప్రారంభించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 2 కోట్ల బిల్లులు అప్లోడ్ చేయాలన్నారు.