News April 24, 2024

విజయనగరం: వెనుతిరుగుతున్న ప్రయాణికులు..!

image

సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో విజయనగరం ఆర్టీసీ డిపోలోని కొన్ని బస్సులను ఆ సభకు తరలించారు. దీంతో కాంప్లెక్స్‌కి వచ్చిన ప్రయాణికులు వెనుతిరుగుతున్నారు. కనీసం ప్రయాణికుల కోసం కొన్ని బస్సులనైనా ఉంచకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు, పక్క జిల్లాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువ డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తుందని మండిపడుతున్నారు.

Similar News

News November 19, 2025

డ్రంకెన్ డ్రైవ్‌లో ఇద్దరికి 7 రోజుల జైలు: SP

image

బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరికి 7 రోజుల జైలు శిక్ష విధించారు. కొర్లాం గ్రామానికి చెందిన బి.హేమంత్, విజయనగరం పట్టణానికి చెందిన అడపాక సాయిలను నవంబర్ 18న నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. కేసును విచారించిన గజపతినగరం మెజిస్ట్రేట్ విజయ్ రాజ్ కుమార్ ఇద్దరికీ జైలు శిక్షను విధించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.

News November 19, 2025

సకాలంలో లక్ష్యాల‌ను సాధించాలి: కలెక్టర్

image

భూసేకరణ కేసుల్లో పూర్తి డేటా సిద్ధం చేసి, ప్రజాభ్యంతరాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే మూడవ, నాలుగవ లైన్ భూసేకరణను వేగవంతం చేయాలని, పారిశ్రామిక పార్కుల్లో కొత్త యూనిట్ల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 19, 2025

సకాలంలో లక్ష్యాల‌ను సాధించాలి: కలెక్టర్

image

భూసేకరణ కేసుల్లో పూర్తి డేటా సిద్ధం చేసి, ప్రజాభ్యంతరాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే మూడవ, నాలుగవ లైన్ భూసేకరణను వేగవంతం చేయాలని, పారిశ్రామిక పార్కుల్లో కొత్త యూనిట్ల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.