News December 23, 2024
విజయనగరం వై జంక్షన్లో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి
వీటీ అగ్రహారానికి చెందిన మురళీ విజయనగరం వైజంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఏఎస్ఐ రామరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఇంటివద్ద నుంచి బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకి తీవ్ర గాయం కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
Similar News
News January 13, 2025
VZM: భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
News January 12, 2025
VZM: ఈ నంబర్లకు కాల్ చేయండి: SP
సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎక్కడైనా అల్లర్లు, ఆకతాయిల వేధింపులు, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే తమకు సమాచారం అందించాలని ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 100, 112 ఫోన్ నంబర్లకు తక్షణమే సమాచారం అందించాలని, పోలీస్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. ప్రజలందరూ ఆరోగ్యకరమైన వాతావరణంలో సంక్రాంతి జరుపుకోవాలని సూచించారు.
News January 12, 2025
ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం తెలుగు ప్రజలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే సంక్రాంతి పండగ ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండగ భోగ భాగ్యాలు కలిగించాలని, అందరి ఇళ్ళల్లో సంక్రాంతి శోభ సంతరించాలని, మూడు రోజుల పండగ సందడితో ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలని కోరారు.