News March 28, 2025

విజయనగరం: శ్రీ విశ్వావ‌సునామ‌ ఉగాది వేడుక‌ల‌కు ఘ‌నంగా ఏర్పాట్లు

image

శ్రీ విశ్వావ‌సునామ ఉగాది వేడుక‌ల‌ను సంప్ర‌దాయ‌భ‌ద్దంగా నిర్వ‌హించేందుకు ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి కోరారు. ఉగాది వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై త‌మ ఛాంబ‌ర్‌లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ సూచ‌న‌ల మేర‌కు ఈనెల 30వ తేదీన ఉగాది వేడుక‌ల‌ను క‌లెక్ట‌రేట్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

Similar News

News April 2, 2025

విశాఖలో హత్యకు గురైన విజయనగరం మహిళ

image

విశాఖపట్నం కొమ్మాది స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది నవీన్ చేసిన దాడిలో గాయపడ్డ నక్కా దీపిక(20) ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఘటనా స్థలంలోనే ఆమె తల్లి లక్ష్మి (43) మృతి చెందింది. రేగిడి మండలం పుర్లికి చెందిన బాధితురాలి తండ్రి రాజు విశాఖ వలస వచ్చి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొమ్మాదిలోని స్వయంకృషినగర్‌లో అద్దెకు ఉంటున్నారు. యువతి పెళ్ళికి అంగీకరించకపోవటంతో హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు.

News April 2, 2025

విజయనగరం: ‘ఉద్యాన‌ పంటల సాగు పెంచేందుకు కార్యాచ‌ర‌ణ‌’

image

విజయనగరం జిల్లాలో ఉద్యాన పంట‌ల సాగును పెంచేందుకు 15 రోజుల్లోగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌స్తుత జిల్లా ప‌రిస్థితులను బ‌ట్టి వ్య‌వ‌సాయ‌, అనుబంధ శాఖ‌ల ద్వారా జిడిపి పెంచేందుకు కృషి చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఉద్యాన‌సాగు, సూక్ష్మ సేద్యంపై కలెక్టర్ బుధవారం త‌మ క్యాంపు కార్యాల‌యంలో కలెక్టర్ స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

News April 2, 2025

VZM: ‘మహిళల జీవనోపాధి కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలి’

image

మహిళలకు జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో చేపట్టేందుకు గల అవకాశాలపై ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు ఆదేశించారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష జరిపారు. మహిళలతో రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, లాభదాయక పంటల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదాయం పెంచే కార్యక్రమాలు చేయాలన్నారు.

error: Content is protected !!