News February 22, 2025
విజయనగరం: 10వ తరగతి విద్యార్థి మృతి

విజయనగరం జిల్లాలో విషాద ఘటన జరిగింది. డెంకాడ మండలం పినతాడివాడకు చెందిన గంగరాజు కుమారుడు రాజు(17) మెర్సీ మిషన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పెదతాడివాడలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన శుభకార్యానికి అతను వెళ్లాడు. తిరిగి బైకుపై ఇంటికి వస్తుండగా పెదతాడివాడ, పినతాడివాడ గ్రామాల మధ్య ట్రాక్టర్ ట్యాంకర్ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అతను చనిపోయాడు.
Similar News
News November 20, 2025
ANU: రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత ఏప్రిల్, ఫిబ్రవరిలో విడుదల చేసిన LLB 5 సంవత్సరాల రీవాల్యుయేషన్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. LLB 5 సంవత్సరాల ఫస్ట్ సెమిస్టర్, 3వ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
News November 20, 2025
క్షణికావేశంలో ఆత్మహత్యలు.. ఒక్కసారి ఆలోచించండి.!

అల్లారుముద్దుగా చూసుకున్న కూతురు పట్టాలపై <<18338200>>మాంసపు ముద్దలా<<>> మారిన వేళ.. బుడిబుడి నడకలు, చిలిపి చేష్టలకు సంబరపడ్డ తల్లిదండ్రులు తెగిపడ్డ తమ బిడ్డ శరీర భాగాలను చూసి తట్టుకోగలరా? కుప్పం(M)లో అనూష.. పేరంట్స్ మందలించారని తనువు చాలించింది. చిన్న చిన్న కారణాలకు ఎంతో మంది క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి విద్యార్థి దశలోనే కౌన్సెలింగ్ ఇస్తే ఇలాంటివి జరగవని పలువురు అంటున్నారు.
News November 20, 2025
WNP: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. గురువారం వీపనగండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాల చట్టం, ఉచిత& నిర్బంధ విద్య హక్కు చట్టం, సైబర్ క్రైమ్స్ & డ్రగ్ అబ్యూస్ గురించి అవగాహన కల్పించారు.


