News February 15, 2025

విజయపురి సౌత్‌లో ఐదు పులుల కదలికలు 

image

వెల్దుర్తి మండలం విజయపురి సౌత్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఐదు పులుల కదలికలను గుర్తించామని ఫారెస్ట్ రేంజర్ సుజాత తెలిపారు. పులుల లెక్కింపు పూర్తయినట్లు తెలిపారు. ఒక ఆడ, మగ పులితో పాటు, 3 పులి పిల్లలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఫారెస్ట్‌లోకి వెళ్లొద్దని, నీటికై గ్రామాలలోకి పులులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఆ పులులు కొట్లాడుకుంటూ ట్రాప్ కెమరాలకు చిక్కాయి. 

Similar News

News November 22, 2025

కొడంగల్: అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఈనెల 24న అక్షయపాత్ర నేతృత్వంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్ భూమి పూజకు సీఎం కొడంగల్ వస్తున్నారు. నిరంతర విద్యుత్, అంబులెన్స్ సర్వీస్, వైద్య సౌకర్యాలు, శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్, త్రాగునీరు, పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 22, 2025

నాన్న 50ఏళ్లు ఇండస్ట్రీని తన భుజాలపై మోశారు: విష్ణు

image

తెలుగు సినిమా పరిశ్రమలో మంచు మోహన్ బాబు 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ’94 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమను 50 ఏళ్లు మా నాన్న తన భుజాలపై మోశారు. ఆయన అసాధారణ ప్రయాణాన్ని చూడగలిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. 50 లెజెండరీ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు నాన్న’ అని ట్వీట్ చేశారు. ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే.

News November 22, 2025

కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల నిర్లక్ష్యంపై CM ఆగ్రహం

image

AP: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కాకినాడ GGHలో గడిమొగకు చెందిన 8నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోవడం, రాజమండ్రి ఆసుపత్రిలో 55ఏళ్ల రోగికి ఎక్స్‌పైరైన మందులివ్వడంతో ఆ రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.