News December 11, 2024

విజయవాడకు వెళ్లిన కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు

image

కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు శ్రీధర్ చెరుకూరి, శ్రీధర్ చామకూరి విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.

Similar News

News December 21, 2025

YS జగన్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన షర్మిల.!

image

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల తన అన్న YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ఆకాంక్షించారు. అన్నపై తనకున్న ప్రేమను చాటుకున్న ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

News December 21, 2025

కడప: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

image

కడప జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. కడపలోని 47వ డివిజన్‌లోని కార్యక్రమాన్ని పైఫొటోలో చూడవచ్చు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?

News December 21, 2025

వ్యవసాయ రంగంతో కడప జిల్లాకు భారీ ఆదాయం.!

image

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి 40.27 లక్షల క్వింటాల్ల వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం జరిగింది. ప్రభుత్వానికి మార్కెట్ సెస్ రూపంలో రూ.7.09 కోట్లు రాబడి లభించింది. (రూ.లక్షల్లో) వరి-115.46, బియ్యం-25.12, వేరు శనగ-30.94, ప్రత్తి-94.77, ఉల్లి-13.29, పప్పు శనగ-16.91, కంది-1.19, బత్తాయి-13.73, పసుపు-92.90, మినుము-30.84, నువ్వులు-54.27, మొక్కజొన్న-62.86, ఇతర వాటినుంచి-157 రాబడి వచ్చింది.