News December 11, 2024

విజయవాడకు వెళ్లిన కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు

image

కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు శ్రీధర్ చెరుకూరి, శ్రీధర్ చామకూరి విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.

Similar News

News November 1, 2025

ప్రొద్దుటూరులో బయటపడిన శ్రీ కృష్ణదేవరాయ శిలా శాసనం

image

ప్రొద్దుటూరులోని సినీ హబ్ శనివారం ఇంటి నిర్మాణం కోసం జేసీబీతో తవ్వుతుండగా శ్రీకృష్ణదేవరాయ శిలాశాసనం బయట పడినట్లు భారత పురావస్తు పరిశోధన డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. ఇది క్రీస్తు శకం 1523 కాలం నాటిదన్నారు. శ్రీకృష్ణదేవరాయలు తిరుమల దేవి పుణ్యం కోసం కావులూరులో చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు వెల్లడించారు. క్రీస్తు శకం 1523 జనవరి 24 శనివారం ఈ శిలా శాసనం వేయించారన్నారు.

News November 1, 2025

నేడు వైవీయూను సందర్శిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి

image

దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నవంబరు 1న మధ్యాహ్నం 3:30 గంటలకు యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. వైవీయూలో నూతన పరిపాలన భవనంలో ఉన్న తాళ్లపాక అన్నమాచార్య సేనెట్ హాల్లో విద్యార్థులతో ప్రత్యేకంగా సంభాషిస్తారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులకు ఇదొక అద్భుతమైన అవకాశమన్నారు.

News November 1, 2025

నేడు వైవీయూను సందర్శిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి

image

దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నవంబరు 1న మధ్యాహ్నం 3:30 గంటలకు యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. వైవీయూలో నూతన పరిపాలన భవనంలో ఉన్న తాళ్లపాక అన్నమాచార్య సేనెట్ హాల్లో విద్యార్థులతో ప్రత్యేకంగా సంభాషిస్తారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులకు ఇదొక అద్భుతమైన అవకాశమన్నారు.