News March 20, 2025
విజయవాడలో అగ్నిప్రమాదం

విజయవాడలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మాచవరం పోలీసుల వివరాల మేరకు బందర్ రోడ్లోని ఓ రెస్టారెంట్ వద్ద కిచెన్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెస్టారెంట్లోని కిచెన్ మొత్తం దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 21, 2025
వంటగది చిట్కాలు

* చపాతీ పిండిలో టేబుల్ స్పూన్ పాలు, బియ్యప్పిండి, నూనె వేసి ఐస్ వాటర్తో కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి.
* పల్లీలు వేయించేటప్పుడు 2 స్పూన్ల నీరు పోసివేయిస్తే తొందరగా వేగడంతో పాటు పొట్టు కూడా సులువుగా పోతుంది.
* కొత్త చీపురుని దువ్వెనతో శుభ్రం చేస్తే అందులో ఉండే దుమ్ము పోతుంది.
* వెల్లుల్లికి వైట్ వెనిగర్ రాస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
* పాలను కాచిన తర్వాత ఎండ, వేడి పడని చోట పెట్టాలి.
News November 21, 2025
కాట్రేనికోన: కొబ్బరి చెట్టు పైనుంచి జారిపడి కార్మికుడి మృతి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా దొంతికుర్రులో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కొబ్బరి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి కర్రీ అప్పలరాజు (36) అనే వలస కార్మికుడు మృతి చెందాడు. మృతుడు విశాఖ జిల్లా గోపాలపట్నం వాసిగా గుర్తించారు. కాట్రేనికోన మండలంలో తోటి కూలీలతో కలిసి దింపులు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉపాధి కోసం వచ్చిన కార్మికుడు మృతి చెందడంతో తోటి కూలీల్లో విషాదం అలముకుంది.
News November 21, 2025
ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేశనపల్లిలో కొబ్బరిచెట్లను ఆయన పరిశీలించనున్నారు. దీంతో పాటు 15గ్రామాల రైతులను పరామర్శించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమలోని కొబ్బరి రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే.


