News February 19, 2025
విజయవాడలో జీబీఎస్ వైరస్ కలకలం

విజయవాడలో జీబీఎస్ వైరస్ కలకలం రేపింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన ఓ మహిళ (30) ఈనెల 18వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు జీబీఎస్ వైరస్గా అధికారులు నిర్ధారించారు. ఆమెను ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 4, 2025
ఇంటి చిట్కాలు

* మినరల్ వాటర్ క్యాన్ను శుభ్రం చేసేందుకు బేకింగ్ సోడా, రాళ్ల ఉప్పు, నిమ్మరసం వేసి పావుగంట తర్వాత క్యాన్ను క్లీన్ చేస్తే సరిపోతుంది.
* బట్టల మీద ఇంక్ మరకలు పోవాలంటే మరకపై కాస్త నీరు చల్లి, పేస్ట్ తీసుకొని బ్రష్తో రుద్ది నీటితో వాష్ చేస్తే మరకలు పోతాయి.
* అగరొత్తుల నుసితో ఇత్తడి సామన్లు శుభ్రం చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
* లెదర్ వస్తువులను నిమ్మచెక్కతో శుభ్రం చేస్తే మెరుస్తాయి.
News December 4, 2025
ఒక్క వ్యక్తి ఆధారంగా రిజర్వేషన్.. ఎన్నిక బహిష్కరణ

TG: STలే లేని పంచాయతీకి ST రిజర్వేషన్ ప్రకటించడంతో నల్గొండ(D) అనుముల(M) పేరూరు గ్రామస్థులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. గతంలో పేరూరు, వీర్లగడ్డ తండా కలిపి ఉమ్మడి పంచాయతీగా ఉండేవి. తరువాత రెండూ విడిపోయాయి. ఆ సమయంలో తప్పుగా నమోదైన ఒకే ఒక్క ఎస్టీ వ్యక్తిని ఆధారంగా తీసుకుని పేరూరు రిజర్వేషన్ కేటాయించారు. ST అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేదు. దీనిపై గ్రామస్థులు HCని ఆశ్రయించారు.
News December 4, 2025
వైసీపీ వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యం: నారాయణ

AP: వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ విమర్శించారు. బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించే నాటికి వర్షాలు ముంచెత్తాయని చెప్పారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రెండో విడత భూసమీకరణపై గ్రామస్థులతో సమావేశమయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని పేర్కొన్నారు.


