News February 19, 2025

విజయవాడలో జీబీఎస్ వైరస్ కలకలం

image

విజయవాడలో జీబీఎస్ వైరస్ కలకలం రేపింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన ఓ మహిళ (30) ఈనెల 18వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు జీబీఎస్ వైరస్‌గా అధికారులు నిర్ధారించారు. ఆమెను ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 1, 2025

జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ లో గర్రెపల్లి సత్తా

image

రెండ్రోజులుగా పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ లో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి క్రీడాకారులు సత్తా చాటారు. షటిల్ విభాగంలో గర్రెపల్లి నుంచి పలు జట్లు పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. నిర్వాహకులు క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కాగా, జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్న క్రీడాకారులను గర్రెపల్లి గ్రామస్తులు అభినందించారు.

News November 1, 2025

హోంమంత్రి పనితీరును ప్రశంసించిన సీఎం

image

హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు. మొంథా తుఫాన్‌లో మంత్రి ప్రజలకు రక్షణ సహాయక చర్యల్లో పాల్గొని సేవలందించారన్నారు. ఈ మేరకు శనివారం ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రికి ప్రశంసాపత్రం, ఉత్తమ సేవా అవార్డును సీఎం అందజేశారు. ప్రజాసేవలో సీఎం చంద్రబాబు చూపిన మార్గం తమకు ఆదర్శం అని హోంమంత్రి అన్నారు.

News November 1, 2025

బంగారం డీల్.. రూ.25 లక్షలతో పరార్..!

image

తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి రూ.25 లక్షలు కాజేసిన ఘటన నరసరావుపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. నరసరావుపేటకు చెందిన గణేష్‌కు శుక్రవారం కేటుగాళ్లు తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మబలికారు. బంగారం డీల్ గురించి మాట్లాడుదామని కోటప్పకొండ వద్దకు రావాలని కోరారు.రూ.25 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.