News May 1, 2024
విజయవాడలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య వివరాలివే..
ఆర్థిక సమస్యలు కుటుంబాన్ని బలి తీసుకున్న ఘటన మంగళవారం విజయవాడ నగరం పటమటలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే మొత్తం ఐదుగురు చనిపోగా.. ధరావత్ శ్రీనివాస్ 40 (డాక్టర్) భార్య ఉష (38) కుమార్తె శైలజ (9) కుమారుడు శ్రీహన్ (5) తల్లి రమణమ్మ (65) ఉన్నారు. తండ్రి జలమయ్య నాయక్ పోలీసు శాఖలో పనిచేసి పదేళ్లక్రితం మరణించారు.
Similar News
News October 1, 2024
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 4,72,512 మందికి పింఛన్లు
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తంగా రేపు 4,72,512 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. అధికారిక డాష్బోర్డు గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,33,248 మందికి రూ.99,45,900,00, కృష్ణా జిల్లాలో 2,39,264 మందికి రూ.1,01,50,95,000 అక్టోబర్ నెల పింఛన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
News September 30, 2024
విజయవాడ: శరన్నవరాత్రి ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబును సోమవారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు, మంత్రితో కలసి చంద్రబాబుకు అమ్మవారి ప్రసాదం, ఆహ్వానపత్రిక అందజేశారు.
News September 30, 2024
ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుంచి స్వీకరించిన సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూసినప్పుడే ప్రజలు సంతృప్తికరంగా ఉంటారన్నారు.