News April 6, 2025
విజయవాడలో నేడు చికెన్ ధరలు ఇవే.!

విజయవాడలో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కేజీ స్కిన్లెస్ చికెన్ రూ.310 ఉండగా నేడు రూ.270గా ఉంది. అలాగే స్కిన్ రూ.260లుగా ఉంది. చేపల ధరలు గత వారంతో పోలిస్తే కేజీకి రాగండి రూ.20లు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. రాగండి కిలో రూ.220గా ఉన్నట్లు రిటైల్ వ్యాపారులు చెప్పారు. మటన్ కిలో రూ.1000 యథావిధిగా ఉంది. మీ ఊరిలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో.. COMMENT చేయండి.
Similar News
News November 13, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: అత్తింటి వేధింపులతో వివాహిత సూసైడ్
> పత్తి అమ్మకంలో రైతుల ఇక్కట్లు
> స్టేషన్ ఘనపూర్: యోగ శిక్షకులకు దరఖాస్తుల ఆహ్వానం
> పాలకుర్తి సోమేశ్వర ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
> కూలిన వల్మిడి బ్రిడ్జి వద్ద తాత్కాలిక రోడ్డు ఏర్పాటు
> ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే
> ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు కృషి చేయాలి: కలెక్టర్
> ఈనెల 14 నుంచి సదరం క్యాంపులు
News November 13, 2025
బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యం- కలెక్టర్ సంతోష్

బాల్య వివాహాలను నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ సంతోష్ పిలుపునిచ్చారు. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగిన ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో, సమన్వయపూర్వకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
News November 13, 2025
జిల్లా వ్యాప్తంగా పోలీసుల క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్పై అవగాహన

ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్, రోప్ పార్టీ విధులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో పోలీసులు చాకచక్యంగా స్పందించేలా రియల్టైమ్ డెమోలు నిర్వహించారు. ప్రజా భద్రత కోసం సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.


