News March 6, 2025
విజయవాడలో నేడు నారా భువనేశ్వరి పర్యటన

విజయవాడకు నేడు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రానున్నారు. స్టెల్లా కాలేజ్ సమీపంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి నేడు ఉదయం ఆమె భూమి పూజ చేయనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆంధ్రాలో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ మేరకు అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News November 23, 2025
కూటమి పార్టీలకు సమాన గుర్తింపు: ఎంపీ

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని కర్నూలు ఎంపీ నాగరాజు పిలుపునిచ్చారు. పంచలింగాలలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనను ముగించేందుకు పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి టీడీపీ-జనసేన-బీజేపీలను కూటమిగా ఏకం చేశారని అన్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీల కార్యకర్తలకు సమాన గుర్తింపు ఉంటుందన్నారు.
News November 23, 2025
తీవ్ర అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా, ఆ తర్వాత 2 రోజుల్లో తుఫానుగా బలపడనుందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వివరించింది.
News November 23, 2025
ఏడీఈ పోస్టింగ్స్లో పైరవీల హంగామా!

NPDCLలో ఏఈ నుంచి ఏడీఈలుగా ప్రమోషన్ పొందిన ఇంజినీర్ల పోస్టింగ్స్పై పైరవీలు జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకుంటూ ముగ్గురు అసోసియేషన్ నేతలు డబ్బులు వసూలు చేసినట్టుగా సమాచారం. కోరుకున్న చోట పోస్టింగ్ కల్పిస్తామని హామీలు ఇచ్చినట్టు చెబుతున్నారు. WGL జోన్లో 30-40 AE, 70-80 ADE పోస్టులకు పదోన్నతుల ప్రక్రియ జరుగుతోంది. దీంతో అర్హులకు న్యాయం చేయాలంటున్నారు.


