News March 6, 2025

విజయవాడలో నేడు నారా భువనేశ్వరి పర్యటన

image

విజయవాడకు నేడు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రానున్నారు. స్టెల్లా కాలేజ్ సమీపంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి నేడు ఉదయం ఆమె భూమి పూజ చేయనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆంధ్రాలో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ మేరకు అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Similar News

News November 15, 2025

పోలీస్ స్టేషన్ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర?

image

జమ్మూకశ్మీర్ నౌగామ్ <<18292633>>పోలీస్ స్టేషన్‌<<>>లో జరిగిన పేలుడుకు తామే కారణమంటూ జైషే మహ్మద్ అనుబంధ ఉగ్రవాద సంస్థ PAFF ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పేలుడు వెనుక ఉగ్రకుట్ర కూడా ఉందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ కేసు దర్యాప్తు చేస్తుండగానే ఈ పేలుడు సంభవించినట్లు J&K పోలీసులు ప్రకటించారు. కానీ, ఉగ్రకోణం అనుమానాలను కొట్టిపారేయకుండా ఆ దిశగానూ దర్యాప్తు ప్రారంభించారు.

News November 15, 2025

ప్రభాస్- డాన్స్ మాస్టర్‌ ప్రేమ్ రక్షిత్ కాంబోలో మూవీ?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో ఫౌజీ, స్పిరిట్, సలార్& కల్కి సీక్వెల్స్ ఉండగా మరో సినిమాకు ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ డైరెక్టర్‌గా మారనున్నారని, ఆయన చెప్పిన కథను ప్రభాస్ ఓకే చేసినట్లు సినీవర్గాల సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రభాస్ ‘రాజాసాబ్’ వచ్చే Jan-9న విడుదలవనుంది.

News November 15, 2025

పిఠాపురం:మర్రెడ్డి శ్రీనివాసరావు తొలగింపు ?

image

పిఠాపురంలో ఇన్‌ఛార్జ్ పాలన కొనసాగేది. ఇటీవల కాలంలో ఐదుగురి కమిటీని నియమించారు. దీనిలోకి గొల్లప్రోలు(M) చేబ్రోలుకు చెందిన ఓదురి కిశోర్ అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పిఠాపురం ఇన్‌ఛార్జ్, కమిటీలో ఒక మెంబర్‌గా కొనసాగిన మర్రెడ్డి శ్రీనివాసరావును తొలగించి ఆ స్థానంలో కిశోర్‌ను నియమించినట్లు సమాచారం.