News February 4, 2025

విజయవాడలో ప్రమాదం.. వ్యక్తి మృతి

image

విజయవాడలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందాడు. కృష్ణలంక పోలీసులు తెలిపిన సమాచారం మేరకు విజయవాడకు చెందిన కొప్పుల భరద్వాజ్ హోటల్ మేనేజ్మెంట్ సీట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో బెంజ్ సర్కిల్ వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News January 16, 2026

సారంగాపూర్: ఉరివేసుకొని యువకుడి మృతి

image

సారంగాపూర్ గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ(26) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మహమ్మద్ రఫీ తాగుడుకు బానిసై మద్యం మత్తులో బుధవారం ఇంటిలో దూలానికి ఉరివేసుకుని మృతి చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి తల్లి షేక్ బిస్మిల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.

News January 16, 2026

నితీశ్‌పై తీవ్ర విమర్శలు.. తిప్పికొట్టిన విహారి

image

భారత జట్టుకు ఆల్‌రౌండర్‌గా పనికిరాడంటూ నితీశ్ రెడ్డిపై వస్తున్న విమర్శలపై హనుమ విహారి Xలో స్పందించారు. ’22 ఏళ్ల వయసులో బ్యాటింగ్, పేస్ బౌలింగ్ చేసే క్రికెటర్లు దేశంలో ఎవరైనా ఉన్నారా? నితీశ్ ఇప్పటివరకు 3 వన్డేల్లో 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 4 T20ల్లో 3W, 4th సీమర్‌గా 10 టెస్టుల్లో 8W పడగొట్టాడు. మెల్బోర్న్‌లో సెంచరీ చేశాడు. అది ఇప్పటికీ చాలా మందికి నెరవేరని కల’ అంటూ నితీశ్‌కు మద్దతునిచ్చారు.

News January 16, 2026

సిద్దిపేట: సోషల్ మీడియా లింక్స్‌పై అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనర్ సీపీ రష్మి పెరుమాళ్ జిల్లా ప్రజలకి ముఖ్య విషయం విజ్ఞప్తి చేశారు. ‘రూ.5 వేలు వస్తాయి.. లింక్స్ షేర్ చేస్తే’ అని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు వస్తున్నాయని, ఇలాంటి ఫేక్ లింక్స్ నమ్మవద్దని తెలియజేశారు. ఇలాంటి లింక్స్ క్లిక్చేస్తే సైబర్ నేరగాళ్ల చేతులకి దొరికిపోతామని హెచ్చరించారు. లింక్ పై క్లిక్ చేస్తే ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.