News February 7, 2025
విజయవాడలో భారీ దొంగతనం

విజయవాడ శివారు ఎనికేపాడులో భారీ దొంగతనం జరిగింది. పటమట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎనికేపాడులోని ఐఫోన్ గోడౌన్ రేకు పగలకొట్టి గుర్తుతెలియని దుండగులు రూ.2.50కోట్ల విలువైన 372 ఐఫోన్లు చోరీ చేసినట్లు గుర్తించారు. మేనేజర్ ఫరూక్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు.
Similar News
News October 25, 2025
KCRపై అభిమానం: సైకిల్పై భద్రాచలం టూ జూబ్లీహిల్స్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా BRS కార్యకర్త భద్రాచలం నుంచి సైకిల్పై వినూత్న ప్రచారం చేపట్టారు. ఈ నెల 19న ప్రారంభించిన యాత్రలో, మాజీ సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకున్నారు. కాంగ్రెస్ ‘గ్యారంటీల బాకీ కార్డుల’ చిత్రాలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. BRS అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.
News October 25, 2025
HYD: స్వచ్ఛ భారత్ మిషన్లో పాల్గొననున్న GHMC

స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన స్వచ్ఛ షహర్ జోడి కార్యక్రమంలో భాగంగా HYD మెంటర్ నగరంగా GHMC ముందుకొచ్చింది. ఈ మెరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తగిన విధంగా చర్యలు చేపట్టనున్నారు. వివిధ పట్టణాల్లో సర్వే సైతం చేపట్టనున్నట్లు తెలిపారు.
News October 25, 2025
HYD: స్వచ్ఛ భారత్ మిషన్లో పాల్గొననున్న GHMC

స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన స్వచ్ఛ షహర్ జోడి కార్యక్రమంలో భాగంగా HYD మెంటర్ నగరంగా GHMC ముందుకొచ్చింది. ఈ మెరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తగిన విధంగా చర్యలు చేపట్టనున్నారు. వివిధ పట్టణాల్లో సర్వే సైతం చేపట్టనున్నట్లు తెలిపారు.


