News June 22, 2024

విజయవాడలో మండుతున్న కూరగాయల ధరలు

image

కూరగాయలు ధరలు భారీగా పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రైతు మార్కెట్లో కేజీ రూ.50గా విక్రయిస్తుండగా.. టమాటా ధర రిటైల్ మార్కెట్లో రూ.70 నుంచి రూ.90 పలుకుతోంది. రాబోయే రోజుల్లో దీని ధరలు ఎంత పెరుగుతాయో అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో రేకెత్తుతోంది. ఇక మిగతా కూరగాయలు పరిస్థితి కూడా ఇలానే ఉన్నాయి. పచ్చిమిర్చి కేజీ రూ.44 ఉంటే, కాకరకాయ రూ.48, బెండ రూ.60, బీరకాయ రూ.55గా ఉన్నాయి.  

Similar News

News October 5, 2024

నూజివీడు ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి ట్రిపుల్ ఐటీలు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దూర ప్రాంతాల్లోని తమ ఇళ్లకు వెళ్లేందుకు 45 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.

News October 5, 2024

కృష్ణా: ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపు గడువు అక్టోబర్ ఒకటితో ముగియగా ఆ గడువును ఈ నెల 30 వరకు పొడిగించామని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30లోపు ఫీజు చెల్లించాలని సూచించింది.

News October 5, 2024

నేడు పార్టీ అధిష్ఠానం వద్దకు కొలికపూడి

image

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై పలువురు చేసిన ఆరోపణలు నియోజకవర్గంలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ మేరకు టీడీపీ అధిష్ఠానం ఆయన్ను వివరణ కోరనుంది. ఇదే సమయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు శావల దేవదత్‌‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొలికపూడిని ఇవాళ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని అధిష్ఠానం ఆదేశించింది.