News June 17, 2024

విజయవాడలో మాజీ కార్పొరేటర్ అర్ధనగ్న ప్రదర్శన

image

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వైసీపీ దళిత నాయకుడినైన తనపై, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గూండా గిరి చేస్తున్నారని YCP మాజీ కార్పొరేటర్ నందెపు జగదీశ్ ఆరోపించారు. గత ఎన్నికల్లో YCP తరఫున ప్రచారం చేశాననే కోపంతో తనకు చెందిన భవనాన్ని బోండా ఉమా అనుచరులు JCBతో కూల్చేశారన్నారు. ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన తాను కూల్చిన భవనం వద్ద <<13456099>>శిరోముండనం చేయించుకుని<<>> అర్ధ నగ్నంగా నిరసన తెలిపానన్నారు.

Similar News

News November 12, 2025

రెవెన్యూ క్రీడా పోటీల్లో కృష్ణా జిల్లాకు రెండో స్థానం

image

అనంతపురంలో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడా పోటీల్లో కృష్ణా జిల్లా బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. సిబ్బంది వివిధ విభాగాల్లో పతకాలను కైవసం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది కృషి, నిబద్ధత ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ వారిని అభినందించారు.

News November 11, 2025

మచిలీపట్నం: టిడ్కో ఇళ్లను ఇవ్వాలని వినతి

image

టిడ్కో ఇళ్ల ఫ్లాట్లను లబ్దిదారులకు అందించాలని ఐద్వా మచిలీపట్నం నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ లో జరిగిన మీకోసం కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. 2017వ సంవత్సరంలో పేదల గృహాల కొరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేద ప్రజల వద్ద రూ.500ల నుంచి రూ.12,500, రూ.25,000లు వసూళ్లు చేసి గృహాలు నిర్మించారన్నారు.

News November 10, 2025

MTM: నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్‌లో “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలలో కూడా PGRS జరుగుతుందని ఆయన వెల్లడించారు.