News January 20, 2025
విజయవాడలో యువకుడి ఆత్మహత్య

విజయవాడ నగరంలోని రాధనగర్లో శనివారం వాచ్మెన్ గొర్లి శివ (25) ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. నున్న పోలీసులు తెలిపిన వివరాల మేరకు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్న శివను యజమాని పిలువగా పలకలేదు. తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సాయంతో తలుపు తెరచి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించాడు. పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Similar News
News February 8, 2025
కృష్ణా జిల్లా: తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య

ఉంగుటూరు మండలం ఆత్కూరులో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు సరిగ్గా వెళ్లటం లేదని తల్లి మందలించడంతో 15 ఏళ్ల బాలిక మనస్తాపం చెంది యాసిడ్ తాగింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు గన్నవరం ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
News February 7, 2025
ఆత్కూరులో మైనర్ బాలిక సూసైడ్

ఉంగుటూరు మండలం ఆత్కూరులో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు సరిగ్గా వెళ్లటం లేదని తల్లి మందలించడంతో 15 ఏళ్ల బాలిక మనస్తాపం చెంది యాసిడ్ తాగింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు గన్నవరం ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
News February 7, 2025
పలు సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గురువారం పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో కొన్ని సమస్యలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు వివరించారు. జిల్లాలో గుడివాడలో కేటీఆర్ కళాశాల, గిలకలదిండి, మెడికల్ కళాశాల, బందర్లోని చిలకలపూడి, పెడన్ మెయిన్ రోడ్, ఉప్పులూరు, గూడవల్లి, నిడమానూరు, గుడ్లవల్లేరు, రామవరప్పాడు వద్ద ROB, RUBలను నిర్మించి ట్రాఫిక్కు చెక్ పెట్టాలని కేంద్రమంత్రిని కోరారు.