News April 2, 2025

విజయవాడలో రూ.252 కోట్ల పన్ను వసూలు

image

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC)లో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.252 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు బుధవారం వీఎంసీ వెల్లడించింది. నగరపాలక సంస్థకు గతంలో ఎన్నడూ లేనంతగా పన్నులు వసూలైనట్లు మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. అనంతరం వీఎంసీ రెవెన్యూ డిప్యూటీ కమిషనర్ సత్యవతిని మేయర్ అభినందించారు.

Similar News

News April 10, 2025

15న మంత్రివర్గ భేటీ.. కీలక పథకాలకు ఆమోదం?

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 15న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో రేపు సా.4 గంటల్లోగా అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. కాగా క్యాబినెట్ భేటీలో మెగా డీఎస్సీతోపాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

News April 10, 2025

నేడు భారత్‌కు ముంబై దాడుల సూత్రధారి!

image

ముంబై ఉగ్రదాడుల్లో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన తహవూర్ రాణాను నేడు భారత్‌కు తీసుకురానున్నారు. అమెరికా అధికారుల నుంచి అతడిని అదుపులోకి తీసుకున్న భారత అధికారులు ప్రత్యేక విమానంలో తరలిస్తున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో దిగే అవకాశం ఉంది. అనంతరం NIA రాణాను తమదైన శైలిలో లోతుగా విచారించనుంది. 26/11 ముంబై దాడుల్లో 166 మందిని రాణా సహా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు.

News April 10, 2025

సుస్థిర అభివృద్ధిలో బండపల్లికి రాష్ట్రంలో పదోర్యాంక్

image

చందుర్తి మండలం బండపల్లి గ్రామపంచాయతీ 80.41 మార్కులతో రాష్ట్రంలో అభివృద్ధిలో ఏ గ్రేడులో ముందు వరుసలో నిలిచింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ.. పంచాయతీలలో మౌలిక వసతుల పెంపు కోసం, ప్రజల సౌకర్యాలు కల్పన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో తాను పనిచేసే బండపల్లి గ్రామం రాష్ట్రంలో 10వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు.

error: Content is protected !!