News March 5, 2025

విజయవాడలో రేపు బీసీవై యువదళం ఆవిర్భావ సదస్సు

image

బీసీవై యువదళం ఆవిర్భావ సదస్సు గురువారం విజయవాడలోని సుజన ది వెన్యులో జరగనుంది. పార్టీ అధినేత రామచంద్రయాదవ్ సహా జిల్లాల నుంచి యువప్రతినిధులు పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలో 50% సీట్లు యువతకే ఇస్తామని.. ఇప్పుడు నియమిస్తున్న బీసీవై యువదళం సభ్యుల్లోనే ఎక్కువమంది ప్రజా ప్రతినిధులుగా చట్ట సభల్లో అడుగు పెట్టేలా ప్రోత్సహించాలనేది తమ పార్టీ ఆలోచన అని రామచంద్ర యాదవ్ అన్నారు.

Similar News

News December 5, 2025

GNT: ఒక్క రోజు మీకు ఇస్తే.. మీ ప్రాధాన్యత ఏంటి.?

image

గుంటూరు జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలెన్నో. గుంతల రోడ్లు, పొంగే డ్రైనేజీలు, తాగునీటి కష్టాలు, ట్రాఫిక్ నరకం.. జనం నిత్యం అవస్థలు పడుతున్నారు. మరి మీకు ఒక్కరోజు సమస్య పరిష్కరించే అధికారం దక్కితే.. వీటిలో ఏ సమస్యను అత్యవసరంగా పరిష్కరిస్తారు? మీ ప్రాధాన్యత ఏంటి? రోడ్లా? నీళ్లా? డ్రైనేజీనా? మీ మనసులో మాట చెప్పండి! ఈ ఒక్కరోజు ఛాన్స్ మీకైతే.. పట్టణ రూపురేఖలు ఎలా మారుస్తారు? కామెంట్ చేయండి.

News December 5, 2025

మాలధారణలో ఉన్నప్పుడు బంధువులు మరణిస్తే..?

image

అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు రక్తసంబంధీకులు మరణిస్తే వెంటనే మాల విసర్జన చేయాలి. మరణించిన వ్యక్తి దగ్గరి బంధువు అయినందున గురుస్వామి వద్ద ఆ మాలను తీసివేయాలి. ఈ నియమం పాటించిన తర్వాత ఓ ఏడాది వరకు మాల ధరించకూడదు. అయితే దూరపు బంధువులు, మిత్రులు మరణిస్తే, మాలధారులకు ఎలాంటి దోషం ఉండదు. వారు మరణించినవారిని తలచుకొని, స్నానం చేసి స్వామిని ప్రార్థిస్తే సరిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>

News December 5, 2025

వారికి కూడా చీరలు.. సీఎం కీలక ప్రకటన

image

TG: 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలను అందించే బాధ్యత మంత్రులు సీతక్క, సురేఖకు అప్పగిస్తున్నట్లు CM రేవంత్ చెప్పారు. ‘ప్రస్తుతం 65L చీరలు పంపిణీ చేశాం. ఇంకా 35L చీరలు రావాలి. ఎన్నికల కోడ్‌తో ఆగిన చోట్ల, పట్టణ ప్రాంతాల మహిళలకూ MAR 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు ఇస్తాం’ అని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు, వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రస్తుతం చీరలు ఇస్తున్న విషయం తెలిసిందే.