News March 5, 2025
విజయవాడలో రేపు బీసీవై యువదళం ఆవిర్భావ సదస్సు

బీసీవై యువదళం ఆవిర్భావ సదస్సు గురువారం విజయవాడలోని సుజన ది వెన్యులో జరగనుంది. పార్టీ అధినేత రామచంద్రయాదవ్ సహా జిల్లాల నుంచి యువప్రతినిధులు పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలో 50% సీట్లు యువతకే ఇస్తామని.. ఇప్పుడు నియమిస్తున్న బీసీవై యువదళం సభ్యుల్లోనే ఎక్కువమంది ప్రజా ప్రతినిధులుగా చట్ట సభల్లో అడుగు పెట్టేలా ప్రోత్సహించాలనేది తమ పార్టీ ఆలోచన అని రామచంద్ర యాదవ్ అన్నారు.
Similar News
News March 14, 2026
నెల్లూరులో పలు హోటల్స్ తనిఖీ.. 92 సిలిండర్లు సీజ్

జిల్లాలోని పలు హోటళ్లు, దుకాణాలు, బార్ & రెస్టారెంట్లు, గ్యాస్ రీఫిల్లింగ్ యూనిట్ల వద్ద విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇళ్లలో వాడే సిలిండర్లను అక్రమంగా హోటల్స్లో వాడుతున్నట్లు గుర్తించారు. భారత్ గ్యాస్ 21 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 17 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 03 నిండిన సిలిండర్లు, మొత్తం 92 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేశారు.
News March 14, 2026
భట్టి ఇంటికి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లారు. ఇటీవల భట్టి కుమారుడి వివాహం జరగగా బిజీ షెడ్యూల్ వల్ల చంద్రబాబు హాజరు కాలేకపోయారు. దీంతో ఇవాళ హైదరాబాద్లోని ఆయన నివాసం ప్రజాభవన్కు వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం చంద్రబాబు అల్లు అరవింద్ నివాసానికి చేరుకొని శిరీష్-నయనిక దంపతులకు విషెస్ తెలిపారు. ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
News March 14, 2026
కర్నూలులో ఈనెల 16న గ్రీవెన్స్: కలెక్టర్

ఈ నెల 16న (సోమవారం) కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టంనిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. అదేరోజు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలు, వినతులు సమర్పించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


