News April 14, 2025

విజయవాడలో రోప్ వే.. ఈసారి కన్ఫామ్

image

భవానీ ఐలాండ్‌కు రోప్‌వే కల సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎదురైన భౌగోళిక, ఆధ్యాత్మిక అడ్డంకులను దృష్టిలో ఉంచుకొని, ఈసారి హరిత బర్మా పార్క్ నుంచి నేరుగా భవానీ ద్వీపం వరకూ 0.88 కి.మీ దూరంలో రోప్‌వే ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ కార్యాచరణ రూపొందిస్తోంది. త్వరలో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రాజెక్టును PPP విధానంలో అప్పగించనున్నారు.

Similar News

News December 7, 2025

మునగాకు కషాయంతో బోలెడు ప్రయోజనాలు!

image

మునగాకు కషాయంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ‘ఫ్రెష్ ఆకులను ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి మరిగించాలి. అవి మెత్తబడ్డాక వడకట్టి తాగాలి. మునగాకులను ఎండబెట్టి, పొడి చేసుకొని కూడా కషాయం చేసుకోవచ్చు. రోజూ పరగడుపున ఒక గ్లాసు ఈ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. షుగర్, BP, కొవ్వు, జీర్ణ సమస్యల్ని నియంత్రిస్తుంది. రక్తహీనత తగ్గుతుంది, ఎముకలు బలపడతాయి’ అని చెబుతున్నారు.

News December 7, 2025

కరీంనగర్: పల్లెపోరులో స్థాయికి మించిన వాగ్దానాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు స్థాయికి మించిన హామీ పత్రాలను పంచుతున్నారు. స్థానిక పన్నులు, కేంద్ర నిధులకు పరిమితమైన పంచాయతీకి భారీ వాగ్దానాలు చేస్తున్నారు. ఇవి ఎలా నెరవేరుతాయోనని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆచరణ సాధ్యతపై అనుమానాలు ఉన్నా, గెలుపు కోసం అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

News December 7, 2025

రెండో విడత ఎన్నికలు.. 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

image

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 23 సర్పంచ్, 306 వార్డులు స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. కామేపల్లి S-6 W-67, ఖమ్మం రూరల్ S-2 W-22, కూసుమంచి S-6 W-87, ముదిగొండ S-1 W-27, నేలకొండపల్లి S-3 W-50, తిరుమలాయపాలెం S-5 W-53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 6 మండలాల్లో మిగిలిన 160 సర్పంచ్, 1380 వార్డు స్థానాలకు ఈనెల 14న ఎన్నిక జరగనుంది.