News April 14, 2025

విజయవాడలో రోప్ వే.. ఈసారి కన్ఫామ్

image

భవానీ ఐలాండ్‌కు రోప్‌వే కల సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎదురైన భౌగోళిక, ఆధ్యాత్మిక అడ్డంకులను దృష్టిలో ఉంచుకొని, ఈసారి హరిత బర్మా పార్క్ నుంచి నేరుగా భవానీ ద్వీపం వరకూ 0.88 కి.మీ దూరంలో రోప్‌వే ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ కార్యాచరణ రూపొందిస్తోంది. త్వరలో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రాజెక్టును PPP విధానంలో అప్పగించనున్నారు.

Similar News

News February 15, 2026

ఆత్మకూరు (ఎం): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

image

మండలంలోని రాయిపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మోత్కూరు నుంచి భువనగిరి వైపు బైక్‌పై వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. మృతుడు తిరుమలగిరి తొండ గ్రామానికి చెందిన వెంకట్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News February 15, 2026

బోథ్: బంతి కోసం వెళ్లి బాలుడి మృతి

image

బోథ్ మండలంలో విషాదం నెలకొంది. కరత్వాడ గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్(12) ఆదివారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న క్రమంలో బంతి పక్కన గల కాలువలో పడింది. బంతి కోసం వెళ్లిన షేక్ ఇమ్రాన్ ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు.

News February 15, 2026

ప్రొద్దుటూరు: కుటుంబీకులను తిట్టాడని చంపాడు

image

ప్రొద్దుటూరు నెహ్రూ రోడ్డులోని నాగులకట్ట వీధిలో 3 రోజుల క్రితం జరిగిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వినయ్‌ను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ కొండారెడ్డి ఆదివారం తెలిపారు. మద్యం తాగే సమయంలో కుటుంబ సభ్యులను దూషించాడనే కోపంతో వినయ్ కత్తితో గొంతులో పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. బొల్లవరం బస్‌స్టాప్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.