News March 5, 2025

విజయవాడలో విషాదం.. ఒక్కసారిగా మంటలు

image

విజయవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొత్తపేట పోలీసులు వివరాల ప్రకారం.. లంబాడి పేటకు చెందిన షేక్ బాజీకి గతంలో యాక్సిడెంట్ జరిగి ఇంటిలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంటిలో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. బాజీ మంటలకు పూర్తిగా కాలిపోయి మృతి చెందాడు. ఫైర్‌కి గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ కొండలరావు తెలిపారు.

Similar News

News November 8, 2025

గ్రామాల్లో ఇళ్లులేని పేదలకు గుడ్‌న్యూస్

image

AP: గ్రామాల్లోని పేదలకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ్ పథకం దరఖాస్తు గడువును పొడిగించింది. NOV 5న గడువు ముగియగా.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈనెల 30 వరకు పొడిగించింది. లబ్ధిదారుల ఎంపికను కేంద్రం ఆవాస్+ యాప్‌లో చేపడుతోంది. అర్హులు సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ సాయంతో యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇంటి నిర్మాణానికి రూ.2.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది.

News November 8, 2025

చలి పెరుగుతుంది.. జాగ్రత్త: IMD

image

దేశవ్యాప్తంగా వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో చలి పెరుగుతుందని IMD పేర్కొంది. ‘వాయవ్య, సెంట్రల్ ఇండియాలో వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-5°C తక్కువగా ఉండే అవకాశముంది. సెంట్రల్, వెస్ట్ ఇండియాలో వచ్చే 48 గంటల్లో 2-3°C, ఈస్ట్ ఇండియాలో వచ్చే 3 రోజుల్లో 3-4°C తగ్గుదల ఉండొచ్చు’ అని అంచనా వేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News November 8, 2025

నేడు సంకటహర చతుర్థి

image

ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత, కృష్ణ పక్షంలో నాల్గవ తిథిని సంకటహర చతుర్థి అని అంటారు. ఈ రోజు విఘ్ననాయకుడైన గణపతికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి, నిండు మనస్సుతో గణనాథుడిని పూజిస్తారు. ఇలా చేస్తే జీవితంలో సంకటాలు, ఆటంకాలు తొలగిపోయి, శుభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతారు. సంకటహర వ్రతాన్ని నేడు ఆచరించడం వలన అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని నమ్మకం.