News February 13, 2025
విజయవాడలో స్లాబ్ కూలి వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మవరపు కృష్ణ (33) బతుకు తెరువు కోసం కుటుంబంతో కలిసి ఏడాది క్రితం విజయవాడకి వచ్చి గుణదలలో అద్దెకు ఉంటున్నారు. కృష్ణ సెంట్రింగ్ పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కనకదుర్గ నగర్లో సెంట్రింగ్ పనులు చేస్తుండగా ఎలివేషన్ స్లాబ్ కూలి కృష్ణపై పడింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పటమట పోలీసులు తెలిపారు.
Similar News
News October 20, 2025
అనకాపల్లి: ఈనెల 20 నుంచి 23 వరకు వర్షాలు

దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదివారం తెలిపారు. ఈ మేరకు రైతులు వ్యవసాయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల క్రింద నిలబడకూడదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనవసరంగా బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
News October 20, 2025
SRCL: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు..!

వరుస లొంగుబాట్లపై నిషేధిత CPI, మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్, ఆశన్న విప్లవ ద్రోహులుగా మిగిలిపోయారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో కేంద్ర కమిటీ తాజాగా లేఖను విడుదల చేసింది. కేంద్ర కమిటీతో చర్చించకుండానే వారు లొంగిపోయారని బహిరంగంగా ఆరోపించింది.
News October 20, 2025
WWC: భారత్ సెమీస్ చేరాలంటే?

WWCలో ఇంగ్లండ్పై ఓటమితో టీమ్ఇండియా సెమీస్ <<18053841>>ఆశలు<<>> సంక్లిష్టంగా మారాయి. రాబోయే రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్పై గెలిస్తేనే ఇతర జట్ల ప్రదర్శనతో సంబంధం లేకుండా సెమీస్ చేరనుంది. ఒకవేళ న్యూజిలాండ్తో మ్యాచులో టీమ్ఇండియా ఓడితే బంగ్లాపై తప్పక గెలవాలి. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో NZ ఓడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇతర జట్లతో పోలిస్తే మెరుగైన RR ఉంటేనే భారత్ సెమీస్ చేరనుంది.