News February 27, 2025
విజయవాడలో 144 సెక్షన్: ఏసీపీ దామోదర్

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు విజయవాడలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సెంట్రల్ జోన్ పరిధిలో 15 పోలింగ్ బూత్లు, ఆరు పోలింగ్ స్టేషన్లో ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల లోపు వ్యాపార దుకాణాలు మూసివేయాలన్నారు.
Similar News
News November 21, 2025
భారీగా తగ్గిన వెండి రేటు.. పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ సిల్వర్ రేటు రూ.12,000 పతనమై రూ.1,61,000కు చేరింది. అటు బంగారం ధరల్లోనూ స్వల్ప మార్పులున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,24,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 ఎగబాకి రూ.1,14,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 21, 2025
కురిచేడు: విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన

కురిచేడు మండలం కల్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. 4, 5 తరగతులకు చదువు చెప్పే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలిపారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
News November 21, 2025
MLA ఉత్తమ్ పద్మావతి గారూ.. 152 మంది రైతుల అవస్థలు తీరేనా?

సూర్యాపేట జిల్లా మోతె మండలం హుస్సేనాబాద్ గ్రామ వైకుంఠధామం నుంచి గండ్ల చెరువు వరకు సుమారు 3 కిలోమీటర్ల డొంక మార్గం అస్తవ్యస్తంగా ఉండటంతో 152 రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రైతులు, పశువులు అలుగు నీటిలో నుంచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చెరువు వద్ద తక్షణమే కల్వర్టు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి, రాకపోకల ఇబ్బందులు తొలగించాలని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని రైతులు కోరుతున్నారు.


