News January 25, 2025
విజయవాడలో 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్.. కారణమిదే.!

విజయవాడ గవర్నర్ పేట పోలీసులు 2 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసును ఛేదించిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. కృష్ణా జిల్లాకు చెందిన ఓ బాలిక పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసిందని చెప్పారు. ఈ కేసును 4 గంటల వ్యవధిలో ఛేదించిన సీఐ నాగమురళి, ఎస్ఐలు దుర్గారావు, ప్రశాంతిలను సీపీ అభినందించారు.
Similar News
News December 13, 2025
కానిస్టేబుల్స్కు 16న నియామక పత్రాలు: హోంమంత్రి అనిత

కొత్తగా ఎన్నికైన కానిస్టేబుల్స్కు ఈనెల 16న నియామక పత్రాలు అందజేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లను ఆమె పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. నియామక పత్రాలు అందుకోవడానికి ఎంపికైన అభ్యర్థులు కుటుంబ సభ్యులతో హాజరుకానున్నట్లు చెప్పారు.
News December 13, 2025
తూ.గో: కాంగ్రెస్ పార్టీకి బిల్డర్ బాబి రాజీనామా!

వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావుకు పంపినట్లు తెలిపారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


