News January 25, 2025

విజయవాడలో 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్.. కారణమిదే.!

image

విజయవాడ గవర్నర్ పేట పోలీసులు 2 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసును ఛేదించిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. కృష్ణా జిల్లాకు చెందిన ఓ బాలిక పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసిందని చెప్పారు. ఈ కేసును 4 గంటల వ్యవధిలో ఛేదించిన సీఐ నాగమురళి, ఎస్ఐలు దుర్గారావు, ప్రశాంతిలను సీపీ అభినందించారు.

Similar News

News November 21, 2025

కొత్త టీచర్లకు సెలవులు ఇలా..

image

AP: మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన కొత్త టీచర్లకు సెలవులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 3న వీరు విధుల్లో చేరగా డిసెంబర్ వరకు వర్తించే ప్రపోర్షనేట్ సెలవులను వెల్లడించింది. 4 CL(క్యాజువల్ లీవ్), 1 OH(ఆప్షనల్ హాలిడే), 2 SPL CL(స్పెషల్ క్యాజువల్ లీవ్), మహిళలు అదనంగా ఒక స్పెషల్ CL వినియోగించుకోవచ్చని తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది ఎంపికైన విషయం తెలిసిందే.

News November 21, 2025

YV సుబ్బారెడ్డిని సిట్ అడిగిన ప్రశ్నలు ఇవేనా..?

image

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్ అధికారులు సుమారు 11గంటల పాటు విచారించారు. ఎందుకు టెండర్ల నిబంధనలు మార్చారు? మైసూరు ల్యాబ్‌లో ఎందుకు పరీక్షలు జరిపారు? నెయ్యి కాదని రిపోర్ట్ వచ్చినా ఎందుకు కొనసాగించారు? అని ప్రశ్నించారు. పీఏ చిన్న అప్పన్న గురించి ప్రశ్నలు సంధించి రికార్డ్ చేసుకున్నారు.

News November 21, 2025

పాలమూరులో ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్

image

పాలమూరులో ఫ్యాన్సీ నంబర్లపై రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల పలువురు కార్లను కొనుగోలు చేయడంతోపాటు ఫ్యాన్సీ, లక్కీ నంబర్ కోసం వేలంలో రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారు. ఈ ఏడాదిలో Nov వరకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,516 వాహనాలకు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ.3.30 కోట్ల ఆదాయం వచ్చింది. వేలంలో 9999 నంబర్‌ను రూ.7.82 లక్షలకు సొంతం చేసుకోగా, 0009ను రూ.7.75 లక్షలు, 5555ను రూ.1.34 లక్షలకు దక్కించుకున్నారు.