News January 25, 2025
విజయవాడలో 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్.. కారణమిదే.!

విజయవాడ గవర్నర్ పేట పోలీసులు 2 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసును ఛేదించిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. కృష్ణా జిల్లాకు చెందిన ఓ బాలిక పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసిందని చెప్పారు. ఈ కేసును 4 గంటల వ్యవధిలో ఛేదించిన సీఐ నాగమురళి, ఎస్ఐలు దుర్గారావు, ప్రశాంతిలను సీపీ అభినందించారు.
Similar News
News October 21, 2025
జనగామ: కార్యాలయం ఉన్నా.. చేయూత సున్నా!

యువతలోని నైపుణ్యాలను పెంపొందించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన యువజన కార్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో యువజన కార్యక్రమాల నిర్వహణ కరవైంది. జనగామ జిల్లాలో 1,89,000 మంది యువత ఉన్నప్పటికీ స్థానిక యువతకు మాత్రం సంబంధిత శాఖ నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందకపోవడం గమనార్హం.
News October 21, 2025
జనగామ జిల్లాలో 4.2 మి.మీ. వర్షపాతం

జనగామ జిల్లాలో గడచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి. తరిగొప్పుల 3.2 మి.మీ., చిల్పూర్ 2.0, జఫర్గడ్ 7.6, స్టేషన్ఘన్పూర్ 2.8, రఘునాథపల్లి 9.6, నర్మెట 1.6, జనగామ 3.4, లింగాల ఘనపూర్ 2.0, దేవరుప్పుల 12.2, కొడకండ్ల 6.0, మొత్తం 4.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
News October 21, 2025
ప్రకృతి గీసిన ‘నిడిగొండ’ చిత్రం

నీలి మేఘాల కింద కారుమబ్బులు అలుముకొని, అస్తమిస్తున్న సూర్యుడికి వాహనాల వెలుగులు దారి చూపుతున్నట్లు ఎంతో అద్భుతంగా ప్రకృతి గీసిన ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. రఘునాథ్ పల్లి మండలం నిడిగొండలో సోమవారం సాయంత్రం ఈ చిత్రం ఆవిష్కృతమైంది. స్థానికుడైన వెంకటేష్ తన ఫోన్లో బంధించి Way2Newsతో ఈ చిత్రాన్ని పంచుకున్నాడు.