News May 12, 2024
విజయవాడలో 22న రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు

పట్టణంలోని గురునానక్ కాలనీలోని గేట్స్ కళాశాల ఆవరణలో మే 22వ తేదీ నుంచి రాష్ట్రస్థాయి సీనియర్ ఓపెన్ చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ సంఘ కార్యదర్శి మందుల రాజు ఆదివారం తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన వాడ పత్రికను ఆయన కళాశాల యాజమాన్యంతో కలిసి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలు, నగదు బహుమతులు కూడా అందిస్తామన్నారు.
Similar News
News February 7, 2025
పలు సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గురువారం పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో కొన్ని సమస్యలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు వివరించారు. జిల్లాలో గుడివాడలో కేటీఆర్ కళాశాల, గిలకలదిండి, మెడికల్ కళాశాల, బందర్లోని చిలకలపూడి, పెడన్ మెయిన్ రోడ్, ఉప్పులూరు, గూడవల్లి, నిడమానూరు, గుడ్లవల్లేరు, రామవరప్పాడు వద్ద ROB, RUBలను నిర్మించి ట్రాఫిక్కు చెక్ పెట్టాలని కేంద్రమంత్రిని కోరారు.
News February 7, 2025
కృష్ణా: కుంభమేళా వెళ్లిన మంత్రి, ఎమ్మెల్యేలు

కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు మహా కుంభమేళా వెళ్లారు. శుక్రవారం ఉదయం బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాగ్ రాజ్కు చేరుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఆధ్యాత్మికవేత్త బాలకృష్ణ గురూజీ మహా కుంభమేళా పవిత్ర స్నానానికి వెళ్లారు.
News February 7, 2025
రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా వాసులు మృతి

ప.గో జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన <<15374910>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు చనిపోయారు. మృతులు కృష్ణా(D) బాపులపాడు మండలం ఆరుగొలనుకు చెందిన దేవ మందిరం, విజయ్ బాబుగా గుర్తించారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో వీరి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. దేవ మందిరానికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విజయ్బాబుకి భార్య, ఐటీఐ చదివే కుమారుడు, టెన్త్ చదువుతున్న కుమార్తె ఉన్నారు.