News January 12, 2025
విజయవాడ: ‘అప్పట్లో అరాచకాలు, ఇప్పుడు నీతులా?’
వైసీపీ ప్రభుత్వంలోనే ఇష్టానుసారంగా సంక్రాంతి సంబరాల పేరుతో క్యాసినోలు నిర్వహించిన ఘనత ఆ పార్టీ నేతలకే దక్కిందని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చింతల అనిల్ కుమార్ విమర్శించారు. శనివారం విజయవాడలో తన కార్యాలయంలో అనిల్ వైసీపీపై మండిపడ్డారు. ఆరు నెలల కూటమి పాలనలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ కాలంలో ఆ పార్టీ నేతలు అరాచకాలు సృష్టించి, నేడు నీతులు వల్లించడం దారుణం అన్నారు.
Similar News
News January 24, 2025
పెనమలూరు: హత్య కేసులో నిందితుడు అరెస్ట్
హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు. సీఐ వెంకట్ రమణ తెలిపిన సమాచారం మేరకు ఈ నెల 9వ తారీఖున పోరంకి ప్రభు నగర్కు చెందిన ఉమ్మడి రాణి అనే మహిళను తన అల్లుడైన నారబోయిన నరేశ్ హత్య చేశాడు. ఆప్పటినుంచి పరారీలో ఉన్న నరేశ్ను గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడిని న్యాయమూర్తిగా హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు శుక్రవారం తెలిపారు.
News January 24, 2025
కోడూరు: అంగన్వాడీ సెంటర్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కలెక్టర్ డీకే. బాలాజీ కోడూరు మండల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉల్లిపాలెం అంగన్వాడీ సెంటర్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పిల్లల అటెండెన్స్, వంటశాల, మంచి నీటి వసతి, గ్రోత్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ స్వయంగా పిల్లల వెయిట్ను పరిశీలించారు. రిజిస్టర్లో చూపించిన రేగులర్ పేర్ల పిల్లలు లేకుండా అంగన్వాడీలో వేరే పిల్లలు ఉండటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News January 24, 2025
మచిలీపట్నం: పలు డివిజన్లలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. 45,46 డివిజన్లలో పర్యటించిన ఆయన ఆయా వార్డుల్లో చెత్త సేకరణను పరిశీలించారు. 46వ డివిజన్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట కమిషనర్ బాపిరాజు, తదితరులు ఉన్నారు.