News March 30, 2025
విజయవాడ: అమ్మవారి ప్రసాదంలో ప్రత్యక్షమైన మేకు

కనకదుర్గమ్మ అమ్మవారి పులిహోర ప్రసాదంలో మేకు ప్రత్యక్షమైనట్లు తాజాగా సమాచారం వెలువడింది. మహా మండపం కింద 4వ కౌంటర్లో పులిహోర పొట్లాలు కొనుగోలు చేసి ప్రసాదం తింటుండగా మేకు రావడంతో వాటిని కొనుగోలు చేసిన భక్తుడు షాక్ అయినట్లు తెలుస్తోంది. అపరిశుభ్రంగా అమ్మవారి ప్రసాదం తయారు చేస్తున్నారని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 2, 2025
MBNR: రేలింగ్లో తలదూర్చిన బాలుడు SAFE..!

ఆడుకుంటూ 167 జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన రేలింగ్లో ఓ బాలుడు తల ఇరుక్కుని అవస్థలు పడ్డ ఘటన గండీడ్ మండలం జానంపల్లి గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వెన్నచేడ్ గ్రామానికి చెందిన నర్సింలు కుటుంబసమేతంగా మరో గ్రామానికి వెళుతున్న సమయంలో అతడి కుమారుడు శ్రీవర్ధన్ ఉన్నట్టుండి రేలింగ్లో తలదూర్చాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి తలను బయటకు తీశారు.
News November 2, 2025
NLG: నాడు ఘన చరిత్ర.. నేడు శిథిలావస్థ..!

శాలిగౌరారం(M) ఆకారంలో ఉన్న 800 ఏళ్ల అతి పురాతనమైన సూర్య దేవాలయం నేడు శిథిలావస్థకు చేరింది. కట్టంగూర్ నుంచి 14KM దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం గ్రామపంచాయతీ నుంచి తూర్పు దిశలో 2KM దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్యులు పరిపాలించారని ఇక్కడ ఉన్న శిలాశాసనం తెలుపుతుంది. వీళ్లు 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం క్రితం ఈ గుడిని నిర్మించారు. ఆలయానికి పునర్వైభవం తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
News November 2, 2025
విజయవాడ: ఫోర్వీలర్ సర్వీస్ టెక్నిషియన్ కోర్సులో ఉచిత శిక్షణ

APSSDC ఆధ్వర్యంలో విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఫోర్వీలర్ సర్వీస్ టెక్నిషియన్ కోర్సులో 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా స్కిల్ అధికారి ఎస్. శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. 8వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులెవరైనా ఈ నెల 9లోపు పాలిటెక్నిక్ కాలేజీలో రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించాలని, శిక్షణ పూర్తైన అనంతరం ఉద్యోగాలు కల్పిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.


