News March 30, 2025

విజయవాడ: అమ్మవారి ప్రసాదంలో ప్రత్యక్షమైన మేకు 

image

కనకదుర్గమ్మ అమ్మవారి పులిహోర ప్రసాదంలో మేకు ప్రత్యక్షమైనట్లు తాజాగా సమాచారం వెలువడింది. మహా మండపం కింద 4వ కౌంటర్‌లో పులిహోర పొట్లాలు కొనుగోలు చేసి ప్రసాదం తింటుండగా మేకు రావడంతో వాటిని కొనుగోలు చేసిన భక్తుడు షాక్ అయినట్లు తెలుస్తోంది. అపరిశుభ్రంగా అమ్మవారి ప్రసాదం తయారు చేస్తున్నారని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Similar News

News April 21, 2025

ప్రపంచంలో అతిపెద్ద పెట్రోల్ బంక్ ఇదే!

image

మన దగ్గర ఉండే పెట్రోల్ బంకుల్లో మహా అంటే 10 వరకు ఫిల్లింగ్ స్పాట్స్ ఉంటాయి. కానీ, ఒకేసారి 120 కార్లకు పెట్రోల్ ఫిల్ చేయగలిగే సామర్థ్యంతో బంక్ ఉందనే విషయం మీకు తెలుసా? అమెరికా టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు సమీపంలో ‘Buc-ee’s’ అనే బంక్ ఉంది. ఇది 75,000 చదరపు అడుగులకు పైగా విస్తరించి ఉండగా ఇందులో ఫుడ్ & షాపింగ్ కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.

News April 21, 2025

కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర: సీఐటీయూ

image

కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాల సవరణ ద్వారా కార్మికులను యజమానులకు పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి ఆరోపించారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు చెంపపెట్టు కావాలని అన్నారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్లో సన్నాహక సదస్సుకు పాల్గొని మాట్లాడారు.

News April 21, 2025

పదో తరగతి ఫలితాలు.. డేట్ ఫిక్స్

image

AP: పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలపై ఉత్కంఠ వీడింది. రిజల్ట్స్ ఈ నెల 23న (బుధవారం) ఉ.10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మీకెంతో ఇష్టమైన Way2News యాప్ ద్వారా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో మార్క్స్ లిస్ట్ వస్తుంది. ఒక్క క్లిక్‌తో షేర్ చేసుకోవచ్చు. ఎలాంటి యాడ్స్ ఉండవు.

error: Content is protected !!