News March 11, 2025

విజయవాడ కోర్టులో పోసానికి బెయిల్

image

రాజంపేట, నరసరావుపేట కోర్టులో పోసాని కృష్ణమురళికి ఇప్పటికే బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ కోర్టులో మంగళవారం పోసానికి బెయిల్ మంజూరు అయింది. మిగతా కేసుల్లో బీఎన్ఎస్ చట్టం 353 సెక్షన్ కింద నోటీసులు హైకోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం కర్నూల్ జైల్లో పోసాని ఉన్నారు. అన్ని కేసుల్లో రిలీఫ్ కావడంతో రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది. 

Similar News

News November 22, 2025

ఏలూరు: ఈనెల 24న జిల్లాస్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని స్కూల్ యాజమాన్యాలకు అండర్-14, 17 బాల, బాలికల క్రికెట్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 24న పెదవేగి మండలం వంగూరు ANM క్రికెట్ అకాడమీలో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడా దుస్తులు, బ్యాట్, బాల్, ప్యాడ్‌లతో హాజరుకావాలన్నారు.

News November 22, 2025

శ్రీకాకుళం: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు

image

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

News November 22, 2025

బాపట్ల: ‘భూ సమస్యలను జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలి’

image

భూ సమస్యలను అధికారులు జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల కలెక్టరేట్‌లో రెవిన్యూ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి భూ అర్జీని నిష్పక్షపాతంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. నిషేధిత భూములపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డిఆర్వో గంగాధర్ గౌడ్, ఆర్‌డీఓలు పాల్గొన్నారు.