News March 11, 2025

విజయవాడ కోర్టులో పోసానికి బెయిల్

image

రాజంపేట, నరసరావుపేట కోర్టులో పోసాని కృష్ణమురళికి ఇప్పటికే బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ కోర్టులో మంగళవారం పోసానికి బెయిల్ మంజూరు అయింది. మిగతా కేసుల్లో బీఎన్ఎస్ చట్టం 353 సెక్షన్ కింద నోటీసులు హైకోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం కర్నూల్ జైల్లో పోసాని ఉన్నారు. అన్ని కేసుల్లో రిలీఫ్ కావడంతో రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది. 

Similar News

News November 18, 2025

MDK: వైద్య కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి తరగతి గదులు, ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, అవసరాలు తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాలు, వసతుల మెరుగుదలకు సూచనలు ఇచ్చి అధికారులను అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News November 18, 2025

పెద్దపల్లి: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి ఎంపీ లేఖ

image

తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్లుగా కొనసాగించాలని, అలాగే పత్తిలో మాయిశ్చర్‌ పరిమితిని 20 శాతం వరకు సడలించాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. మిల్లర్లు అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కూడా ఎంపీ కోరినట్లు తెలిపారు.

News November 18, 2025

మెదక్: బాలుడిపై దాడి చేసిన పినతండ్రి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

image

మద్యం మత్తులో బాలుడిపై దాడి చేసిన పిన తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రామాయంపేట ఎస్ఐ బాలరాజు తెలిపారు. అక్కన్నపేటకు చెందిన ముత్యం సత్యనారాయణ, వంశి అనే బాలుడిని ఈనెల 13న మద్యం మత్తులో విచక్షణ రహితంగా దాడి చేశాడు. బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సత్యనారాయణను మంగళవారం రిమాండ్‌కు తరలించారు.