News May 4, 2024

విజయవాడ: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటుపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళుతున్న  విజయవాడకు చెందిన ప్రసాద్(70)ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా గాయపడగా గమనించిని స్థానికులు వెంటనే అతనిని విజయవాడ ప్రైవేట్ హాస్పటల్‌కు తరలిచారు.. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

Similar News

News December 27, 2025

కృష్ణా: జోగి రమేశ్ ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే నకిలీ మద్యం తయారీ.!

image

మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులైన అద్దేపల్లి జనార్ధనరావు, జగన్మోహనరావులను పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో శుక్రవారం వీరి ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేశ్ అందించిన ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే నకిలీ మద్యాన్ని తయారు చేశామని నిందితులు పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్టు సమాచారం.

News December 25, 2025

మచిలిపట్నం: కలెక్టరేట్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

image

లోకానికి ప్రేమ, శాంతి, కరుణను బోధించిన మహోన్నత వ్యక్తి ఏసుప్రభువు అని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ కొనియాడారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని ‘మీ కోసం’ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా తినిపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

News December 25, 2025

మచిలిపట్నం: కలెక్టరేట్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

image

లోకానికి ప్రేమ, శాంతి, కరుణను బోధించిన మహోన్నత వ్యక్తి ఏసుప్రభువు అని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ కొనియాడారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని ‘మీ కోసం’ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా తినిపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.