News June 29, 2024
విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చేవారికి ముఖ్య సూచన

వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, అన్ని శాఖల అధికారులు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30లోపు రావొద్దని EO కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు. ఉదయం 11.45- మధ్యాహ్నం 12.45 వరకు మహా నైవేద్యం జరుగుతుందని, అందువలన ఈ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30లోపు, మినహా మిగతా సమయాల్లో దర్శనానికి రావాలన్నారు.
Similar News
News January 8, 2026
జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్తో కలిసి పాల్గొన్నారు.
News January 8, 2026
కృష్ణా: గృహ నిర్మాణాలపై కలెక్టర్ అసంతృప్తి

జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి సకాలంలో లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం గృహ నిర్మాణం పురోగతిపై కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 103 గృహాలు మాత్రమే పూర్తి కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
News January 8, 2026
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

రానున్న వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ DK బాలాజీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయన గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో అన్ని సమ్మర్ స్టోరేజీ చెరువులను నింపినట్లు చెప్పారు.


