News October 6, 2024

విజయవాడ: దుర్గమ్మ రేపు ఏ అవతారంలో దర్శనమిస్తారంటే?

image

శరన్నవరాత్రులలో భాగంగా దుర్గమ్మ రేపు ఆదివారం నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ లలితా దేవి తనను కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుందని పండితులు తెలిపారు. చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించిన అమ్మవారు భక్తుల ఇక్కట్లు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందన్నారు.

Similar News

News February 8, 2026

కృష్ణా జిల్లాలో నాన్‌వెజ్ ధరలు ఎంతంటే..?

image

కృష్ణా జిల్లాలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్‌‌ లెస్ కేజీ రూ. 280, స్కిన్‌ రూ. 270గా విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు సమాచారం. మటన్ కేజీ రూ.1,000గా ఉంది. చేపల్లో బొచ్చ కేజీ రూ. 220లు, 30 కోడిగుడ్లు గతవారం రూ. 165లు ఉండగా నేడు రూ. 153కు చేరుకుంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 7, 2026

మచిలీపట్నంలో 38 మంది అధికారులపై చర్యలు

image

మచిలీపట్నం నగర పాలక సంస్థలో పని చేస్తున్న 38 మందిపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ACB అధికారులు చేపట్టిన తనిఖీల్లో బిల్లులు ఇవ్వకుండా కొత్త నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం, ఇంటి పన్నుల విధింపులో అవకతవకలు చేశారని గుర్తించారు. దీనికి బాధ్యులైన 38 మందిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. వీరిలో అప్పటి మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఉన్నారు.

News February 6, 2026

బందరు పోర్టుకు రూ.573.77 కోట్ల రహదారి ప్రాజెక్టు..!

image

బందరు పోర్టు అభివృద్ధికి ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం రూ.573.77 కోట్లతో భారీ రహదారి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. NH-65, NH-216 జంక్షన్‌లను నేరుగా పోర్టుతో అనుసంధానిస్తూ 6 లైన్ల ప్రధాన రహదారి, సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రాజెక్టులో 3 ఫ్లైఓవర్లు, ఒక భారీ రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు తెలిపారు.