News May 9, 2024

విజయవాడ: దేవానందరెడ్డి సేవలు భేష్

image

రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల మూల్యాంకనంతోపాటు వేగవంతమైన ఫలితాలు విడుదలలో పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి పాత్ర ప్రశంసనీయమని ఉపాధ్యాయుడు వెంకటేశ్ అన్నారు. దేవానందరెడ్డి పరీక్షల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరీక్షల విభాగం మొత్తాన్ని ప్రక్షాళన చేశారన్నారు. సమస్యాత్మకమైన సెంటర్లపై దృష్టి పెట్టడంతో మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు.

Similar News

News October 1, 2024

గుంటూరు జిల్లాలో జూ.NTR ‘దేవర’ సక్సెస్ మీట్.?

image

జూ.ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా గత నెల 27న రిలీజై భారీ వసూళ్లు రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలంలో అక్టోబర్ 3న ఫంక్షన్ ఏర్పాటుకు సోమవారం నిర్వాహకులు స్థలాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ నిర్వహించనుండగా.. చిత్రయూనిట్ పాల్గొననున్నట్లు సమాచారం.

News October 1, 2024

కొలికపూడి వ్యాఖ్యలపై మీ కామెంట్.!

image

మహిళా ఉద్యోగులకు తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు అసభ్యకర సందేశాలు పంపారని తిరువూరు మం. చిట్టేలలో నిన్న మహిళలు ఆరోపణలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు నిజమైతే అరెస్ట్ చేయాలని.. లేకపోతే వారికి శిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అసత్య ఆరోపణలను నియోజకవర్గ ప్రజలు నమ్మరని చెప్పారు. మరోవైపు, ఆయన నిన్న రాత్రి దీక్ష చేపట్టగా.. అధిష్ఠానం ఆదేశాల మేరకు విరమించారు. కొలికపూడి చేసిన వ్యాఖ్యలపై మీ COMMENT.

News October 1, 2024

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 4,72,512 మందికి పింఛన్లు

image

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తంగా రేపు 4,72,512 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. అధికారిక డాష్‌బోర్డు గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,33,248 మందికి రూ.99,45,900,00, కృష్ణా జిల్లాలో 2,39,264 మందికి రూ.1,01,50,95,000 అక్టోబర్ నెల పింఛన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.