News March 17, 2025
విజయవాడ: నకిలీల ఘటనపై స్పందించిన ఏసీపీ

నకిలీ పోలీసులు, నకిలీ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచించారు. సోమవారం మాచవరం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు, మీడియా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను ఎవరైనా బెదిరిస్తే నిస్సంకోచంగా పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదన్నారు.
Similar News
News February 27, 2026
విజయ్కు ఓ నటితో వివాహేతర సంబంధం.. భార్య ఆరోపణలు

హీరో విజయ్ నుంచి విడాకులు కోరుతూ <<19254475>>పిటిషన్<<>> దాఖలు చేసిన భార్య సంగీత సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందన్నారు. 2021లో ఈ విషయం తెలిసి మానసిక క్షోభకు గురైనట్లు చెప్పారు. ఇది పెళ్లిపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేటట్లు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఇటీవల TNకు చెందిన ఓ BJP నేత సైతం విజయ్కు ఓ నటితో అఫైర్ అంటగడుతూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
News February 27, 2026
పార్వతీపురం: వైద్య ఆరోగ్య రంగ అభివృద్ధి పనులు వేగవంతం కావాలి

జిల్లాలో నిర్మితమవుతున్న వివిధ ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు. APSMIDC ద్వారా వివిధ ప్రాజెక్టుల పురోగతిపై శుక్రవారం కలెక్టరేట్లో వీడియో సమావేశాన్ని నిర్వహించారు. పాలకొండలో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు, సాలూరు, కురుపాం ప్రాంతాల్లో జరుగుతున్న ఇతర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
News February 27, 2026
చీపురుపల్లి: సీఎం వస్తున్నారు.. కీలక ప్రకటన ఉంటుందా..!

చీపురుపల్లి(M) రావివలసలో శనివారం CM చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో నియోజకవర్గంలో పలు సమస్యలపై సీఎం ప్రకటన చేస్తారని ప్రజలు నిరీక్షిస్తున్నారు. సుమారు 80 వేల మంది కోరుకుంటున్న RECS పునరుద్ధరణ, తోటపల్లి పిల్ల కాలువల నిర్మాణం, చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి, గరివిడి పశుసంవర్ధక కళాశాలకు అదనపు భవనాలు మంజూరు, చీపురుపల్లిలో ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తిపై హామీ కోసం ఎదురుచూస్తున్నారు.


