News October 19, 2024

విజయవాడ నుంచి విశాఖపట్నంకు ఇంద్ర ఏసీ బస్సు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి విశాఖపట్నంకు ప్రతి రోజూ ఇంద్ర AC బస్సు నడుపుతున్నామని RTC ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని, తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని RTC వర్గాలు విజ్ఞప్తి చేశాయి. 

Similar News

News November 13, 2025

గుడివాడకు జనవరి 12వ తేదీ నుంచి వందే భారత్ రైలు

image

చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు జనవరి 12వ తేదీ నుంచి పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం కానుంది.

News November 13, 2025

గన్నవరం: జాతీయ రహదారిపై ప్రమాదం.. స్పాట్ డెడ్.!

image

గన్నవరం (M)కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైకును వెనుక నుంచి ఢీకొట్టడంతో, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంతోష్ (31)అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ గూడవల్లి చైతన్య కళాశాల హాస్టల్‌లో వంట మాస్టర్‌లుగా పనిచేసేవారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గన్నవరం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News November 13, 2025

ప్రతిష్టాత్మక కమిటీలో మచిలీపట్నం ఎంపీకి స్థానం

image

మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి మరో ప్రతిష్టాత్మక కమిటీలో చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు-2025 జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు సంయుక్త కమిటీ సభ్యులుగా బాలశౌరిని నియమించారు. ప్రతిష్టాత్మకమైన కమిటీలో చోటు దక్కినందుకు ఎంపీ బాలశౌరి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలియజేశారు.