News February 25, 2025

విజయవాడ : నేడు పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

image

కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వంశీని పోలీస్ కస్టడీలో విచారించనున్నారు. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ పై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం కోర్టులో హాజరు పరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశించింది.

Similar News

News December 1, 2025

జగిత్యాల: గ్రీవెన్స్ డేలో అర్జీదారులకు భరోసా ఇచ్చిన ఎస్పీ

image

ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈ రోజు జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో అశోక్ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 5మంది అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేస్తూ, ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరుగునట్లు చూడాలని తెలిపారు.

News December 1, 2025

‘చిన్నస్వామి’ సేఫ్టీ క్లియరెన్స్ కోరిన ప్రభుత్వం

image

RCB ర్యాలీలో తొక్కిసలాట నేపథ్యంలో వచ్చే IPLకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరగడంపై సందిగ్ధత నెలకొంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు ఇచ్చింది. స్టేడియం సేఫ్టీ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఆ నివేదిక నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ నుంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో ప్రిపేర్ చేయించాలని ఆదేశించింది.

News December 1, 2025

అధికారులకు బాపట్ల కలెక్టర్ ఆదేశాలు

image

దిత్వా తుఫాను కారణంగా పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 10 శాతం కూడా వరి కోత అవలేదని, వరి దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలన్నారు. డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచి, మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులతో కూడిన టీమ్‌ను ఏర్పాటు చేసి, ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు.