News February 18, 2025
విజయవాడ: నేడు సబ్ జైలు వద్దకు రానున్న జగన్

విజయవాడకు నేడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్తో సబ్ జైల్లో ములాకత్ అవనన్నారు. ఉదయం 9:30 గంటలకు సబ్ జైల్లో వంశీని జగన్ పరామర్శించనున్నారు. జగన్ గాంధీనగర్లోని సబ్ జైల్ వద్దకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్తో పాటు రాష్ట్రంలోని పలువురు వైసీపీ నేతలు సబ్ జైలు వద్దకు రానున్నారు.
Similar News
News November 10, 2025
10న యథావిధిగా ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’: కలెక్టర్

అమలాపురం కలెక్టరేట్లో ఈనెల 10 సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి, ఆర్డీవో, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.
News November 10, 2025
గుంటూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచన

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్తో పాటు మండల ప్రధాన కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inలో కూడా సమర్పించవచ్చని, అదేవిధంగా 1100 నంబర్కి డయల్ చేసి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు పీజీఆర్ఎస్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 10, 2025
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ నరసింహ

ఈ నెల 15న జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. రాజీ మార్గమే రాజమార్గం అని ఆయన పేర్కొన్నారు. రాజీపడదగిన కేసుల్లో ఇరువర్గాలు పరస్పర అవగాహనతో పరిష్కారం కనుగొంటే, సమయం, ధనం, శ్రమ ఆదా అవుతాయని తెలిపారు. పోలీసులు రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారని ఎస్పీ తెలిపారు.


