News February 18, 2025

విజయవాడ: నేడు సబ్ జైలు వద్దకు రానున్న జగన్

image

విజయవాడకు నేడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌తో సబ్ జైల్లో ములాకత్ అవనన్నారు. ఉదయం 9:30 గంటలకు సబ్ జైల్లో వంశీని జగన్ పరామర్శించనున్నారు. జగన్ గాంధీనగర్‌లోని సబ్ జైల్ వద్దకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్‌తో పాటు రాష్ట్రంలోని పలువురు వైసీపీ నేతలు సబ్ జైలు వద్దకు రానున్నారు.

Similar News

News March 21, 2025

విజయవాడలో 100 బృందాలతో తనిఖీలు 

image

డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నిర్ధేశాను సారం ఈగల్ టీమ్ ఐజీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్, స్థానిక పోలీసులు, డ్రగ్స్ డిపార్ట్ మెంట్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం టీమ్‌గా ఏర్పడి మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలపై దాడులు నిర్వహించారు. ఈగల్ యాంటీ-నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ ఆకే రవి కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడను నిర్వహించినట్లు తెలిపారు. 

News March 21, 2025

తెలుగు కామెంటేటర్స్ సిద్ధం.. మీ ఫేవరెట్ ఎవరు?

image

స్టేడియంలో ప్లేయర్లు తమ ఆటతో అలరిస్తే, కామెంటేటర్లు తమ మాటలతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ ప్యానల్‌ను సిద్ధం చేసింది. గతంలో ‘ఉప్పల్‌లో కొడితే.. తుప్పల్లో పడింది’ అనే డైలాగ్ తెగ వైరలైంది. ఈ ప్యానల్‌లో రాయుడు, MSK ప్రసాద్, శ్రీధర్, హనుమ విహారి, సుమన్, ఆశిశ్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ, అక్షత్ రెడ్డి, శశి, కళ్యాణ్, కౌశిక్, హేమంత్, నందు ఉన్నారు.

News March 21, 2025

తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు

image

జిల్లాలో మొదటిరోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఈఓ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 8,627 మంది విద్యార్థులకు గాను మొదటి రోజు 8,616 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 11 మంది గైర్హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

error: Content is protected !!