News March 31, 2025
విజయవాడ: పున్నమి ఘాట్లో మృతదేహం

కృష్ణానది పున్నమి ఘాట్ వద్ద గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైనట్లు భవానిపురం పోలీసులు తెలిపారు. పున్నమి ఘాట్ వద్ద ఆదివారం గుర్తుతెలియని మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడికి 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందన్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని, మృతుడి ఒంటిపై ఎరుపు కలర్ షర్ట్, చెక్స్ ప్యాంట్ ఉన్నాయన్నారు.
Similar News
News February 24, 2026
వనపర్తి: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

వనపర్తి జిల్లాలో ఇంటర్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మాస్ కాపీయింగ్కు తావులేకుండా నిఘా ఉంచామని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం 633 మంది ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు మంగళవారం వెల్లడించారు.
News February 24, 2026
ఒకరోజు ముందే పెన్షన్లు

AP: రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయనుంది. మార్చి 1న ఆదివారం ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉండటంతో ఈనెల 28న అందజేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ల పంపిణీ నేపథ్యంలో ఆ రోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని CM చంద్రబాబు నిర్ణయించారు. పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టంచేశారు. మరోవైపు 28న పెన్షన్లు అందుకోని వారికి మార్చి 2న ఇవ్వనున్నారు.
News February 24, 2026
పరిశ్రమల్లో భద్రత ముఖ్యం: కలెక్టర్ హనుమంతరావు

జిల్లాలోని పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు, పేలుళ్లు జరగకుండా యాజమాన్యాలు కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ఎస్పీ అక్షాంష్ యాదవ్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రసాయన, డ్రగ్ ఫ్యాక్టరీల్లో అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


