News March 31, 2025
విజయవాడ: పున్నమి ఘాట్లో మృతదేహం

కృష్ణానది పున్నమి ఘాట్ వద్ద గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైనట్లు భవానిపురం పోలీసులు తెలిపారు. పున్నమి ఘాట్ వద్ద ఆదివారం గుర్తుతెలియని మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడికి 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందన్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని, మృతుడి ఒంటిపై ఎరుపు కలర్ షర్ట్, చెక్స్ ప్యాంట్ ఉన్నాయన్నారు.
Similar News
News September 19, 2025
MDK: కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు

ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.84 వేల కోట్లు అయితే కేవలం తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టే ప్రాణహిత-చేవెళ్లకు రూ.35 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. రూ.35వేల కోట్లు ఖర్చు చేసి కేవలం 4.47లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం, అమోఘమని ఎద్దేవా చేశారు.
News September 19, 2025
ఏపీలో గోల్డ్ మైన్.. త్వరలో పసిడి ఉత్పత్తి!

AP: కర్నూల్(D) జొన్నగిరి వద్ద తాము అభివృద్ధి చేస్తున్న గనిలో త్వరలో పసిడి ఉత్పత్తిని ప్రారంభిస్తామని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ MD హనుమప్రసాద్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇదే జరిగితే దేశంలో గనుల నుంచి బంగారాన్ని తీసే తొలి ప్రైవేట్ కంపెనీగా DGML నిలవనుంది. ఏటా 750-1000kgs గోల్డ్ ఉత్పత్తి అవుతుందని అంచనా.
News September 19, 2025
దేశంలోనే ముల్కనూర్ సహకార సొసైటీ నంబర్ 1

HNK జిల్లా భీమదేవరపల్లి(M) ముల్కనూర్ సహకార సొసైటీ దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. ఇది ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద సోసైటీగా గుర్తింపు పొందింది. 1956లో అలిగిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి 373 మంది రైతులతో రూ.2,300 మూలధనంతో ప్రారంభించారు. ఈ సొసైటీ ప్రస్తుతం 7,540 మంది రైతులతో రూ.400 కోట్లతో విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం ముల్కనూర్ సహకార పరపతి సంఘం 69వ వార్షిక మహాసభ వేడుకలు జరుగుతున్నాయి.