News April 1, 2025
విజయవాడ: ‘పేదల భద్రతే ప్రభుత్వ లక్ష్యం’

ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పేదలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని, ఇంటివద్దే పింఛన్ల పంపిణీతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని జిల్లా ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి తెలిపారు. మంగళవారం విజయవాడ రూరల్, గొల్లపూడి రెండో సచివాలయంలో పింఛన్ల పంపిణీని పరిశీలించారు. జిల్లాలో 2,28,813 లబ్ధిదారులకు రూ. 98.11 కోట్లు పంఛన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు.
Similar News
News October 30, 2025
పాలమూరు: నేడే.. డయల్ యువర్ డిఎం

ఆర్టీసీ సమస్యలపై మహబూబ్ నగర్ డిపో ఆధ్వర్యంలో ఇవాళ డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సుజాత తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని ప్రయాణికులు తమ సమస్యలను సలహాలను, సూచనలను గురువారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 వరకు తెలుపాలన్నారు. 99592 26295 చరవాణి నంబర్కు ఫోన్ చేసి సమస్యలను వివరించాలన్నారు. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 30, 2025
VJA: ఆలయాల నష్టంపై కమిషనర్ సమీక్ష

‘మొంథా’ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని దేవాదాయ సంస్థలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కమిషనర్ కె. రామచంద్ర మోహన్ బుధారం ఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆలయ భవనాలు, ఆస్తుల నష్టం వివరాలు సేకరించి, తక్షణ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిసరాల శుభ్రత, శానిటేషన్ను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
News October 30, 2025
బీ అలెర్ట్.. కృష్ణా నదికి 6 లక్షల క్యూసెక్కుల వరద.!

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణా నది మరోసారి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇవాళ ప్రకాశం బ్యారేజ్కి 6 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బ్యారేజ్ వద్ద 2.68 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 2 గంటల్లో 3.97 లక్షలకు వరద చేరుకుంటుందని దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనునట్లు అధికారులు తెలిపారు.


