News June 16, 2024
విజయవాడ: ‘బాబాయ్ అంటూ ఇల్లు మొత్తం దోచేశారు’

ఎనికేపాడు నివాసి అయిన పెరూరి సత్యనారాయణ (68), గోవిందమ్మ దంపతులపై శుక్రవారం రాత్రి 10 గంటలకు దోపిడీ జరిగింది. వారు నిర్వహిస్తున్న కిరాణా షాపుకి వచ్చిన ఒక వ్యక్తి బాబాయ్ అంటూ మాట కలిపి షాపు షటర్ దింపి మరొక ఇద్దరితో కలసి వారిద్దరి చేతులు కట్టేసి రూ.1.80 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం దోచేశారు. ఈ ఘటనపై పటమట పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా CCTV ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News January 22, 2026
గ్రీన్ క్లైమేట్ ఫండ్తో మత్స్యకారులకు అండ: కలెక్టర్

గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలో నిర్వహించిన సమీక్షలో అలంకార చేపలు, పీతల పెంపకం, సముద్ర నాచు యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు. లబ్ధిదారుల ఎంపిక, శిక్షణకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ పథకం ద్వారా మత్స్య సంపద పెంపుదల, ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News January 22, 2026
కృష్ణా: ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి

కృష్ణా జిల్లా పరిషత్లో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏఓ) పదోన్నతి లభించింది. వీరికి సంబంధించిన నియామక ఉత్తర్వులను జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పల హారిక బుధవారం పంపిణీ చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
News January 22, 2026
కృష్ణా: ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి

కృష్ణా జిల్లా పరిషత్లో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏఓ) పదోన్నతి లభించింది. వీరికి సంబంధించిన నియామక ఉత్తర్వులను జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పల హారిక బుధవారం పంపిణీ చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.


