News January 28, 2025

విజయవాడ మీదుగా నడిచే రెండు రైళ్లు రద్దు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే 2 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.22648 కోచువెల్లి- కోర్బా ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 3, 6, 10న, నం.22647 కోర్బా- కోచువెల్లి ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 5, 8, 12న రద్దు చేసినట్లు వివరించారు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News November 18, 2025

జేఎన్టీయూలో తినే ఆహారంలో పురుగులు

image

కూకట్‌పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్‌లో విద్యార్థులు తినే ఆహారంలో మరోసారి పురుగులు దర్శనమిచ్చాయి. సోమవారం రాత్రి హాస్టల్లో అన్నం తినే సమయంలో పురుగులు కనిపించాయని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.

News November 18, 2025

జేఎన్టీయూలో తినే ఆహారంలో పురుగులు

image

కూకట్‌పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్‌లో విద్యార్థులు తినే ఆహారంలో మరోసారి పురుగులు దర్శనమిచ్చాయి. సోమవారం రాత్రి హాస్టల్లో అన్నం తినే సమయంలో పురుగులు కనిపించాయని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.

News November 18, 2025

టెన్త్ పరీక్షలపై BIG UPDATE

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను మార్చి 16 లేదా 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆ రెండు తేదీల ప్రకారం టైం టేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటిలో ఓ దానికి ఆమోదం లభించనుంది. ఈసారి 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 3,500 సెంటర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 35వేల మంది ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ మొదలైంది.