News March 19, 2025

విజయవాడ మీదుగా నడిచే 2 రైళ్లు రద్దు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే 2 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.22875 విశాఖపట్నం – గుంటూరు, నం.22876 గుంటూరు- విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ నెల 24న రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని కోరుతూ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News December 21, 2025

GNT: తెలుగు సినిమారంగంలో తొలి మహిళా చిత్ర నిర్మాత

image

ప్రముఖ రంగస్థలనటి, తొలితరం తెలుగు సినిమా నటి, చిత్ర నిర్మాత దాసరి కోటిరత్నం ప్రత్తిపాడులో జన్మించారు. చిన్నప్పటి నుంచే కోటిరత్నానికి నటనలో శిక్షణ ఇచ్చాడు. ఈమె తొలి మహిళా నాటక సమాజ స్థాపకురాలు. ఈమె నాటకాల్లో స్త్రీ పాత్రలతో పాటు అనేక పురుష పత్రాలు ధరించేవారు. ఈమె లవకుశలో- కుశుడు, ప్రహ్లాదలో – ప్రహ్లాద మొదలైన పాత్రలు ధరించారు. ఆమె తెలుగు సినిమారంగంలో తొలి మహిళా చిత్ర నిర్మాత.
@ నేడు ఆమె వర్ధంతి

News December 21, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త పాక్స్ మండలాలు ఇవే

image

PACS పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి వరంగల్ పరిధిలో నూతన PACS ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. HNK జిల్లాలో వేలేరు, ప్రగతి సింగారం, దామెర, నడికుడ, MLG జిల్లాలో ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, WGL జిల్లాలో రాయపర్తి, నర్సంపేట, BHPL జిల్లాలో రేగొండ, MHBD జిల్లాలో తొర్రూరు, గూడూరు, నర్సింహులపేట, పోగులపల్లి, JNG జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్, నర్మేట సిద్ధిపేట జిల్లాలో చేర్యాల, రెబర్తి ఉన్నాయి.

News December 21, 2025

ఉత్కంఠ.. బిగ్‌బాస్ విజేత ఎవరు?

image

తెలుగు బిగ్‌బాస్-9 విజేతను హోస్ట్ నాగార్జున ఇవాళ రాత్రి ప్రకటించనున్నారు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టాప్-5 కంటెస్టెంట్లుగా కళ్యాణ్, తనూజ, డిమోన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఉన్నారు. సోషల్ మీడియా బజ్ ప్రకారం కళ్యాణ్, తనూజలో ఒకరు విన్నర్ అవుతారని తెలుస్తోంది. తొలుత సంజన, తర్వాత ఇమ్మాన్యుయేల్, డిమోన్ ఎలిమినేట్ అవుతారని సమాచారం. విజేత ఎవరని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.