News March 19, 2025

విజయవాడ మీదుగా నడిచే 2 రైళ్లు రద్దు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే 2 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.22875 విశాఖపట్నం – గుంటూరు, నం.22876 గుంటూరు- విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ నెల 24న రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని కోరుతూ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News December 24, 2025

టుడే హెడ్‌లైన్స్

image

*AP నుంచి క్వాంటం టెక్నాలజీలో నోబెల్ గెలిస్తే రూ.100 కోట్లు: CM చంద్రబాబు
*TDP-JSP చెప్పినవి అబద్ధాలని RBI డేటాతో తేలింది: జగన్
*కొత్త సర్పంచులు మంచి పాలన అందించాలి: CM రేవంత్
*KCR గర్జిస్తే సమాధానం చెప్పే దమ్ము CMకి లేదు: KTR
*TGలో DEC 31 అర్ధరాత్రి వరకు వైన్స్, 1AM వరకు బార్స్
*భారత్‌లో 3 కొత్త ఎయిర్ లైన్స్: కేంద్రమంత్రి రామ్మోహన్
*శ్రీలంక ఉమెన్స్‌పై రెండో టీ20లో భారత్ ఘన విజయం

News December 24, 2025

భారత్ అండర్-19 జట్టుపై ICCకి ఫిర్యాదు చేస్తాం: పాక్

image

అండర్-19 ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్ టీమ్ తీరుపై ICCకి కంప్లైంట్ చేయనున్నట్టు PCB, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చెప్పారు. ‘మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీమ్‌ఇండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నారు. పాలిటిక్స్, స్పోర్ట్స్‌ను వేరుగా చూడాలి. భారత ఆటగాళ్ల తీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తాను’ అని తెలిపారు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో అండర్-19 ఆసియా కప్‌ను పాక్ గెలుచుకుంది.

News December 24, 2025

జగిత్యాల జిల్లాలో పెరిగిన హత్యలు: ఎస్పీ

image

మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో హత్యల సంఖ్య గత సంవత్సరం కంటే పెరిగిందని తెలిపారు. 2023లో 28 హత్యలు జరగగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 29 హత్యలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అయితే, మిగతా నేరాల రేటు గత సంవత్సరం కంటే 5 శాతం తగ్గినట్లు వివరించారు. ఈ క్రమంలో సహకరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.