News March 19, 2025

విజయవాడ మీదుగా నడిచే 2 రైళ్లు రద్దు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే 2 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.22875 విశాఖపట్నం – గుంటూరు, నం.22876 గుంటూరు- విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ నెల 24న రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని కోరుతూ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News December 12, 2025

సిద్దిపేట: సీపీతో ‘ఫోన్ ఇన్’ రద్దు

image

ప్రతి శనివారం సామాన్య ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’ కార్యక్రమాన్ని ఈ వారం రద్దు చేస్తున్నట్లు కమిషనరేట్ కార్యాలయం ప్రకటించింది. రాష్ట్రంలో జరుగుతున్న రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వివరించింది. తదుపరి ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం డిసెంబర్ 20 రోజున యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొంది.

News December 12, 2025

నెల్లూరు: నేటి అర్ధరాత్రి నుంచి అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ క్లోజ్

image

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో తూర్పు పడమర ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రధానమైన అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ మరమ్మతు పనుల దృష్ట్యా నేటి అర్ధరాత్రి నుంచి మూసివేస్తున్నట్లు కమిషనర్ వై.ఓ నందన్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి వచ్చే ఏడాది జనవరి నెల 10వ తేదీ వరకు మరమ్మతు పనులను చేపట్టి ఫ్లైఓవర్‌ను ఆధునికరించనున్నామని కమిషనర్ వివరించారు.

News December 12, 2025

వారికి ఇంటర్ ఎగ్జంప్షన్‌ పేపర్‌కు మార్కులు

image

AP: ఇంటర్ EXAMSలో దివ్యాంగులు ఎగ్జంప్షన్‌ పొందిన పేపర్‌కు ఇకపై సగటు MARKS ఇస్తారు. ఈమేరకు GO విడుదలైంది. వీరు 2 లాంగ్వేజ్ పేపర్లలో 1 రాస్తే చాలన్న రూలుంది. 5 పేపర్లలో 4కి MARKS వేసి మినహాయింపు పేపర్‌కు ‘E’ అని సర్టిఫికెట్లో పొందుపరుస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లపై IIT, NITలు అడ్మిషన్లు నిరాకరిస్తుండడంతో దివ్యాంగులు ఇబ్బంది పడగా గతేడాది లోకేశ్ జోక్యంతో సీట్లు దక్కాయి. ఇపుడన్నిటికీ MARKS ఇస్తారు.