News March 26, 2025

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సంత్రాగచ్చి, యశ్వంత్‌పూర్ మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 3 నుంచి 24 వరకు ప్రతి గురువారం SRC-YPR(నెం.02863), ఏప్రిల్ 5 నుంచి 26 వరకు ప్రతి శనివారం YPR- SRC(నెం.02864) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో గుంటూరు, రాజమండ్రి, దువ్వాడ, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News November 30, 2025

MHBD: ముగిసిన తొలి దశ నామినేషన్ స్వీకరణ

image

జిల్లా వ్యాప్తంగా తొలి దశ నామినేషన్ స్వీకరణ శనివారంతో ముగిసింది. తొలి దశ ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో 155 సర్పంచ్ స్థానాలకు 1239, వార్డ్ మెంబర్ స్థానాలకు 3,496 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, ఆదివారం నుంచి రెండో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు షెడ్యూల్ పరిధిలోని నిర్ణీత పంచాయతీలో అధికారులు స్వీకరిస్తారు.

News November 30, 2025

కృష్ణా: LLB పరీక్షా ఫలితాలు విడుదల

image

కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలకు సంబంధించి LLB-2, BA LLB-2, 6 సెమిస్టర్ ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారులు విడుదల చేశారు. LLB-2లో 261 మంది పరీక్షలు రాయగా 77.78% ఉత్తీర్ణత సాధించారన్నారు. BA LLB-2 సెమిస్టర్‌లో 87.79%, BA LLB-6 సెమిస్టర్‌లో 94.12% ఉత్తీర్ణత సాధించారని పరీక్షల నియంత్రణాధికారి డా.పి.వి బ్రహ్మచారి తెలియజేశారు.

News November 30, 2025

బీజేపీ ఖమ్మం జిల్లా ఇన్‌ఛార్జ్‌గా మహిపాల్ రెడ్డి

image

బీజేపీ జిల్లాల వారీగా పార్టీ ఇన్‌ఛార్జుల పేర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు శనివారం ప్రకటించారు. ఇందులో భాగంగా బద్ధం మహిపాల్ రెడ్డి ఖమ్మం జిల్లా ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. ఖమ్మానికి చెందిన కొండపల్లి శ్రీధర్ రెడ్డిని వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా, సన్నె ఉదయ్ ప్రతాప్‌ను నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు వెల్లడించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి.