News March 26, 2025

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సంత్రాగచ్చి, యశ్వంత్‌పూర్ మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 3 నుంచి 24 వరకు ప్రతి గురువారం SRC-YPR(నెం.02863), ఏప్రిల్ 5 నుంచి 26 వరకు ప్రతి శనివారం YPR- SRC(నెం.02864) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో గుంటూరు, రాజమండ్రి, దువ్వాడ, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News December 21, 2025

ప్రపంచంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు ఇవే.. మనవెక్కడ?

image

ప్రపంచంలోని బిజీయెస్ట్ రైల్వే స్టేషన్ల లిస్ట్‌లో జపాన్ టాప్‌లో ఉంది. టోక్యోలోని ‘షింజుకు’ ఏడాదికి 116 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలతో తొలి స్థానంలో నిలిచింది. టాప్ 10లో ఏకంగా 8 ఆ దేశంలోనే ఉన్నాయి. ఇండియా నుంచి కోల్‌కతాలోని హౌరా స్టేషన్ 54 కోట్ల మందితో ఆరు, సియాల్దా స్టేషన్ ఎనిమిదో ప్లేస్‌లో ఉన్నాయి. అధిక జనసాంద్రత, రోజూ ఆఫీసులకు వెళ్లేవారి రద్దీ వల్లే ఈ స్టేషన్లు ఎప్పుడూ కిక్కిరిసిపోతున్నాయి.

News December 21, 2025

చిత్తూరు: ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు

image

పీఎం ఆవాస యోజనలో భాగంగా పక్కా గృహాల నిర్మాణానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. పుంగనూరు నియోజకవర్గంలో 6,485, చిత్తూరులో 1,628, నగరిలో 2,331, పూతలపట్టులో 5,035, జీడీ నెల్లూరులో 5,930, కుప్పంలో 13,657, పలమనేరులో 15,391 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్పారు. ఇందులో సుమారు 8వేల మంది ఇంటి స్థలాలను కూడా మంజూరు చేయాలని కోరారు.

News December 21, 2025

iBOMMA రవి కేసు.. విచారణ గందరగోళం

image

పైరసీ వ్యవహారంలో అరెస్టైన iBOMMA రవిని టెక్నికల్ ఆధారాలతో ప్రశ్నించినా పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెబుతూ విచారణను గందరగోళంగా మారుస్తున్నాడని సమాచారం. తాను సినిమా పైరసీ ద్వారా డబ్బు సంపాదించలేదని తెలిపాడు. బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా మాత్రమే సంపాదించానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ యాప్ యజమానుల వివరాలను చెప్పలేదు. ఐబొమ్మ సైట్‌లో పనిచేసిన సిబ్బంది వివరాలపై కూడా మౌనం వహించాడు.