News January 30, 2025
విజయవాడ మెట్రోకు భూసేకరణ.. ప్రభుత్వం ఆదేశం

విజయవాడ మెట్రోకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విజయవాడలో మెట్రోకు భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. విజయవాడలో మెట్రోకు 101 ఎకరాలు అవసరం కాగా పనులకు ఎంత ఖర్చు అవుతుందో అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదికను కేంద్రంకు పంపారు. ఈ మేరకు భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Similar News
News November 22, 2025
అవకాడోతో కురులకు మేలు

అవకాడో ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంతోపాటు కురులకూ మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఈ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అవకాడోని హెయిర్ ప్యాక్తో జుట్టు చిట్లడం తగ్గడంతో పాటు తొందరగా పెరుగుతుంది. అవకాడో, అరటి పండు పేస్ట్ చేసి టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15రోజులకొకసారి చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
News November 22, 2025
ఏలూరు: ఈనెల 24న జిల్లాస్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని స్కూల్ యాజమాన్యాలకు అండర్-14, 17 బాల, బాలికల క్రికెట్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 24న పెదవేగి మండలం వంగూరు ANM క్రికెట్ అకాడమీలో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడా దుస్తులు, బ్యాట్, బాల్, ప్యాడ్లతో హాజరుకావాలన్నారు.
News November 22, 2025
శ్రీకాకుళం: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు

ట్రైనింగ్పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.


