News March 24, 2025
విజయవాడ మెట్రో పనుల్లో ముందడుగు

విజయవాడ మెట్రోకు సంబంధించి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్(CMP) సిద్ధం చేసే సంస్థగా సిష్ట్రా MVA కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంపికైంది. ఈ మేరకు ఆ సంస్థకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా లెటర్ ఆఫ్ అవార్డు(LOA) అందజేసినట్లు సమాచారం వెలువడింది. కాగా రూ.11 వేల కోట్ల అంచనా వ్యయంతో 38.40 కి.మీ. మేర ఫేజ్-1లో 2 మెట్రో కారిడార్లను విజయవాడలో ప్రభుత్వం నిర్మించనుంది.
Similar News
News December 4, 2025
రైల్వే నాణ్యతపై ప్రయాణికులు సంతృప్తి!

భారతీయ రైల్వే ఏటా 58కోట్ల ప్యాక్డ్ మీల్స్ను ప్యాసింజర్స్కు అందిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో నాణ్యతపై అందిన ఫిర్యాదులు 0.0008 శాతమేనని పేర్కొంది. వీటిపై విచారణ జరిపి గత నాలుగేళ్లలో రూ.2.8కోట్ల జరిమానా విధించినట్లు తెలిపింది. నాణ్యమైన ఆహారం అందించడానికి రైల్వే నిరంతరంగా కృషి చేస్తుందని స్పష్టం చేసింది. అయితే SMలో మాత్రం ఆహార నాణ్యతపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్న విషయం తెలిసిందే.
News December 4, 2025
సూర్యాపేట: పోస్టల్ బ్యాలెట్లు జాగ్రత్తగా జారీ చేయాలి: కలెక్టర్

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులపై రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా జారీ చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పోలింగ్ అనంతరం ఓట్లను కౌంటింగ్ చేయడానికి తగిన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 4, 2025
సూర్య ఘర్పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయండి: కలెక్టర్

పీఎం సూర్య ఘర్ పథకం ప్రయోజనాలు ప్రతీ ఇంటికి చేరేలా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. 2026-27 నాటికి దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో లక్ష గృహాలకు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


