News February 27, 2026
విజయవాడ: రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు వాయిదా

SAAP లీగ్లో భాగంగా నిర్వహించాల్సిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు పబ్లిక్ పరీక్షల కారణంగా వాయిదా పడ్డాయి. ఈనెల 28, మార్చి 1కు బదులుగా ఏప్రిల్ 04, 05న ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా విభాగాల క్రీడాకారులు జిల్లాస్థాయి ఎంపికలు అవసరం లేకుండా నేరుగా sports.ap.gov.inలో నమోదు చేసుకుని రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనవచ్చని శాప్ అధికారులు తెలిపారు.
Similar News
News April 12, 2026
దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)
News April 12, 2026
NZB: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక ఘట్టం: MP

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక ఘట్టమని, 2029 ఎన్నికల నాటికి వాటిని అమలు చేయబోతున్నామని NZB MP ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా మహిళలకు రిజర్వేషన్లపై చట్టం చేయబోతున్నారని అన్నారు. మహిళల 30 ఏళ్ల నిరీక్షణకు ప్రధాని మోదీ తెరదించారని, వారికి ఇంతకంటే పెద్ద పండుగ ఉండదని పేర్కొన్నారు.
News April 12, 2026
హుజూర్నగర్ విద్యార్థినికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

హుజూర్నగర్కు చెందిన బోరెడ్డి వర్షిత ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. వర్షిత అసాధారణ ప్రతిభపై తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షితను పలువురు ప్రముఖులు అభినందిస్తూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.


